6, మార్చి 2015, శుక్రవారం

::: భూమి విలువ :::
రాజధాని వస్తే భూమికి విలువ పెరుగుతుంది తద్వారా రైతులు లాభపడతారు అంటున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తే...

ఎంతోమందిని కాలిచేయింది, ఊళ్లకువూల్లు వలసలు పంపి మనం నాగార్జున సాగర్ డాం కట్టుకున్నాం, దేనికి? 
అలాగే ఇప్పుడు 293 గ్రామాలలోని సుమారు 3 లక్షల మందిని వాళ్ళ గొడ్డు గోదాము, చెట్టు పుట్ట, ఇల్లు వాకిలి, పొలిమేర రాయిని, దేవుడి గుడిని అన్ని వదిలేసి పొండి అని నిర్దాక్షిణ్యంగా తరలిస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం దేనికి ?
సాగు భూమి కోసం. నీటి కోసం. పంటలు పండడం కోసం. బీడుగా ఉన్న నేలని సస్యస్యామలం చేయడం కోసం. నీరే మనకి ఆధారం. జీవి ప్రాణాలకి కావాల్సింది నీరే. ఆ నీటిని ఒడిసిపట్టి ప్రకాశం బారేజి కట్టి వాటర్ స్టోరేజ్ వల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగి నేల సారవంతమై 365 రోజులూ పచ్చగా వుండే నేల ఎన్ని కోట్లవిలువైనదో రైతు పుట్టుక పుట్టిన ప్రతివాడికి తెలుస్తుంది. మన ముక్యమంత్రికి వాళ్ళ మంత్రులకి తప్ప. 
అసలు నేలకి విలువ తనలో మొక్కలు పెరిగినప్పుడే. మొక్క మొలవని నేల ఎడారి అవుతుంది. దానికి విలువ వుండదు. మరి మన బాబు గారు కన్ను పచ్చని పైరుల మీద ఎందుకు పడిందో అర్ధంకాదు యెంత ఆలోచించినా. 
రైతుకి బూమి విలువ పెరగడం అంటే తనపోలం అన్నపూర్ణగా ఉన్నప్పుడే. "నీకేంట్రా సాంబయ్యా నీ పొలం మూడు పంటలుపండుద్ది నీకన్నా లచ్చాదికారి ఎవడ్రా వూళ్ళో" అంటుంటారు ఇప్పరికీ ఊళ్లలో.
కాని అదే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి పైరు కన్నా దాని విలువ పెరగడమే ముక్యం. అచ్చు మన బాబు గారిలా. ఇలాంటి నేల ఈ రెండు జిల్లాలలో ఇంకోచోట లేదు. 
రాజధానే కట్టాల్సివస్తే 50 చదరపు కిలోమీటర్ల పరిదిలో ప్రభుత్వ భూమి కూడా దాదాపు 30 వేల ఎకరాలు ఉండొచ్చు. అంతకనా ఎక్కువే ఉండొచ్చు. అదీ పంటలు పండని భూమి. అలాంటి భూమిని విలువ పెంచితే బాబుగారు దేవుడు అనొచ్చు. అదివదిలెసి ఏ రైతుకైనా అత్యంత విలువైన, సారవంతమైన నేలని అమ్ముకోండి, మాకిచ్చేయండి. వ్యవసాయం మానండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయండి అంటే వీడు మనిషా లేక మానా. పోనీ అంతగా వాస్తు అనుకుంటే వినుకొండ ఎలాగూ వుంది. అదీ కాక ఇదీ కాక పచ్చని పైరుల్లో కాంక్రీట్ పొద్దామనుకొనె ఈ చర్య దేశ సుభిక్షాన్ని కోరుకొనే వాడెవ్వడూ ఒప్పుకోడు.
రేపు పోలవరం బ్యాక్ వాటర్లో నీలాగే ఇంకొకడు పొలాల్లో రాజధానొ లేక ఏ ఇండస్ట్రియల్ కారిడారో పెడతాను అంటే ఇప్పటి ప్రజల త్యాగాలకి విలువ ఉంటుందా. మనం నాగారికులమేనా బాబుగారు ఒక్కసారి ఆలోచించండి...

4, మార్చి 2015, బుధవారం

స్మార్ట్‌సిటీల పేరుతో బిజెపి, టిడిపి ప్రభుత్వాలు ప్రజల నెత్తిన భారాలు మోపుతున్నాయి. స్మార్ట్‌సిటీల ముసుగులో విదేశీ కంపెనీలు, బడా ప్రైవేట్‌ సంస్థలకు పట్టణాలను కట్టబెట్టే కుట్రలు సాగిస్తున్నాయి

.Ysr వాన్ పిక్ పేరుతో 24 వేల ఎకరాలు సేకరిస్తే స్మార్ట్ సిటి పేరు తో చంద్రబాబు 54 వేల ఎకరాలు. ఇద్దరికీ తేడా ఏమీటి?

రాజధాని ఏర్పాటు పేరుతో 30 వేల ఎకరాల పంట భూములను ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో విధి విధానాలు లేకుండా స్వాధీనం చూస్తే ఇద్దరికీ తేడా ఏమీటి?

 బడా పారిశ్రామికవేత్తలు, కృష్ణాతీరంలో కబ్జాచేసిన 2 వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి సరి

దేశంలో 30 వేల ఎకరాలు -సేకరించిన రాజధానే లేదు
-హైదరాబాద్‌లో రాజధాని 225.520 ఎకరాలే
-చండీగఢ్ ఉన్నది 114 చ.కి.మీ.లోనే

 బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టే కార్పొరేట్ మూకలను చుట్టు పెట్టుకుని 30 వేల ఎకరాల్లో ఆయన చేసేది రాజధాని నిర్మాణమా? రియల్ ఎస్టేట్ దందానా?


 ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిస్తున్న త్రీడీ సినిమా. ఆయన భజన బందం, ఆస్థాన పత్రికలు కూడా యథాశక్తి ఊదరగొడుతున్నాయి. తామేం తక్కువ తినలేదన్నట్టు ఆస్థాన ఎన్నారైలూ సదస్సులు పెట్టి భారీగా చందాలు సేకరిస్తున్నారు. ఇక్కడా హుండీలు. అవి చాలవన్నట్టు పత్రికలు కూడా ఆ కార్యక్రమంలో తలమునకలవుతున్నాయి. ఇంతకీ ఒక రాజధానికి ఎంత భూమి కావాలి? దేశంలో అనేక రాజధానుల వైశాల్యమెంత? ఏపీ జనాభా ఎంత? ఆదాయమెంత? దానికి ఈ 30వేల ఎకరాలకు పొంతన ఉందా?

ప్రపపంచలోనే ప్రతిష్టాత్మకమైన రాజధానిని నిర్మిస్తానని ప్రచారం చేస్తూ పచ్చటి పంటలు పండే 30 వేల ఎకరాల భూములను కొల్లగొడుతున్నారు.

ఈ మొత్తం ప్రక్రియ వెనుక కార్పొరేట్ సంస్థల మాయాజాలం ఉందనే ఆరోపణలున్నాయి. టీడీపీ పంచన చేరిన ఈ కార్పొరేట్ సంస్థల యజమానులు ఈ ప్రాంతంలో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేశారని, వాటికి భారీ మార్కెట్ సష్టించే పనిలో భాగంగానే ఇదంతా జరుగుతుందని అంటున్నారు.

చంద్రబాబు నేల విడిచి సాము చేస్తున్నారని మేధావులు అంటున్నారు. ఆయనదంతా మాయ. చెప్పేది కొండంత..చేసేది గోరంత..ఒకవైపు నిధులు లేవంటారు. రాజధానికి హుండీలు పెడతారు. చందాలు వసూల చేయిస్తారు. మరోవైపు కోట్ల ఖర్చుపెట్టి ఉత్సవాలు చేస్తారు. చార్టర్‌ైఫ్లెట్లు వేసుకుని సింగపూర్ వెళ్తారు.

 ప్రభుత్వ భూమి ఉండగా సేకరణ దేనికి?
అసలు భూసేకరణే అవసరం లేదు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయి. అవి సరిపోతాయి. స్కూల్స్, హౌజింగ్, అధికారుల నివాసాలకు, మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లకు, అసెంబ్లీ, రాజ్‌భవన్, సచివాలయ నిర్మాణాలకు ఎంత భూమి అవసరమో చెప్పంది ముందు. 
-యలమంచలి శివాజీ


2, మార్చి 2015, సోమవారం

రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలు నాశనం సబబా?

  • 23/12/2014
ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన రైతు స్వరాజ్య వేదిక
హైదరాబాద్, డిసెంబర్ 22: రాజధాని నిర్మాణాన్ని రియల్ ఎస్టేట్ వ్యవహారంగా చూడటం తగదని రైతు స్వరాజ్య వేదిక ఆవేదన వ్యక్త చేసింది. రాజదాని నిర్మాణం కోసం తహతహలాడుతున్న ప్రభుత్వ తీరుచూస్తుంటే కొంత మంది వ్యక్తులకు లబ్ధిచేకూర్చేలా ఉందని విమర్శించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వేదిక ప్రతినిధులు విస్సా కిరణ్, కనె్నగంటి రవి, ఉమాశంకరి మాట్లాడుతూ వేల రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాల భూములను నాశనం చేయడం ఎంత వరకు సబబని అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చి రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములను లాక్కొనేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తుందని అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ సూచించిన వాటిని సైతం పక్కన పెట్టి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుందని విమర్శించారు. అన్నపూర్ణగా పేరొందిన విజయవాడ, గుంటూరు మధ్య ఉన్న వేల ఎకరాల భూములను భవన నిర్మాణాల కోసం వినియోగించడం సరికాదని అన్నారు. దీని ద్వారా భూములు కోల్పోతున్న రైతులతో పాటు ఆయా వ్యవసాయక్షేత్రాలలో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న వారు ఉపాధికి దూరమవుతారని పేర్కొన్నారు. అలాంటి వారి కోసం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం నిర్ధిష్టంగా పేర్కొనడం లేదన్నారు. ఎంతో మంది గిరిజనులను ముంచి నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నుంచి రాజధాని అవసరాల కోసం నీటిని తరలించడం సరికాదని ఆ నీటిని కేవలం వ్యవసాయ అవసరాల కోసమే వాడాలని అన్నారు. ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల నుంచి సేకరించిన భూములను సరైన పారితోషకం, వారికి పూర్తిస్థాయిలో ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు.

28, ఫిబ్రవరి 2015, శనివారం

జిడిపి వృద్ధి రేటు ఉరకలపై సర్వే అంచనాలను ఆమోదించే ముందు దృష్టిలో ఉంచుకోవాల్సిన కీలక విషయం ఒకటుంది. జిడిపిని గణించే ప్రాతిపదిక సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు కొద్ది కాలం కిత్రమే మార్చారు. ఈ మార్పుతో జిడిపి లెక్కకు రెక్కలొచ్చాయి. ఆర్థిక రంగానికి అత్యంత గడ్డుకాలంగా చెప్పుకునే 2013-14లో కొత్త లెక్కప్రకారం వృద్ధి రేటు ఏకంగా 6.9 శాతానికి దూసుకుపోయింది. ఇప్పుడు అదే లెక్కల ప్రకారం వచ్చే ఏడాది 8 శాతానికి ఆపై సంవత్సరాల్లో రెండంకెల స్థాయికి దూసుకుపోతుందని సర్వే అంచనావేస్తోంది. అంకెల ఇంద్రజాలంతో సమకూరే వృద్ధి రేటు ఏమార్చడానికి తప్ప ఆర్థిక రంగ నిజపరిస్థితులను మార్చడానికి దోహదం చేయదు.

ఫారెక్స్‌ నిల్వలను లక్ష కోట్ల డాలర్లకు పెంచుకోవడం మంచిదే. అయితే అందులో స్థిరంగా ఉండే సొమ్ము ఎంతనేదే కీలకం. చిన్నపాటి ప్రతికూల పరిణామాలకే ఎగిరిపోయే సొమ్ము ఎంత ఉన్నా ప్రమాదహేతువే.

రూ. 17,77,477 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రణాళికేతర వ్యయం రూ.13 లక్షల కోట్లు కాగా, ప్రణాళికా వ్యయం రూ.4.65 లక్షల కోట్లు.
బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు :
- ద్రవ్యలోటు 3.96 శాతం
- వచ్చే ఏడాది నుంచి జీఎస్‌టీ అమలు
- కార్పొరేట్‌ ట్యాక్స్‌ 30 నుంచి 25శాతానికి తగ్గింపు
- స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలు ఇచ్చేందుకు స్విట్జర్లాండ్‌ అంగీకరించింది
- నల్లధనం తగ్గించే యోచనలో భాగంగా పన్నుల విధానం
- విదేశాల్లో నల్లధనం దాచుకునే వారికి పదేళ్ల జైలుశిక్ష
- నల్లధనంపై 300శాతం జరిమానా
- నల్లధనాన్ని ప్రోత్సహించే బ్యాంకులు, సంస్థలపై జరిమానా
- బినామీ ఆస్తుల నిరోధానికి కొత్త బిల్లు
- రూ.లక్షకు మించి ఆస్తుల కొనుగోలుకు పాన్‌ నంబర్‌ తప్పనిసరి

వృద్ధి, పెట్టుబడులు పెంచడం, సంపద అందరికీ పంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతానికి చేరుకుంటుందని అంచనా మంత్రి వేశారు. ద్రవ్యోల్బణం 5.1 శాతానికి తగ్గిందని ఆయన చెప్పారు. విదేశీ మాదకద్రవ్యం నిల్వలు బాగా పెరిగాయన్న జైట్లీ విదేశీ మారకం నిల్వలు 340 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయన్నారు.

ఐటీ పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు
- సంపద పన్ను రద్దు
- రూ.కోటి ఆదాయం దాటినవారిపై 2శాతం సర్‌చార్జ్
- రూ. వెయ్యి దాటిన పాదరక్షలపై ఎక్సైజ్‌ డ్యూటీ 6శాతం తగ్గింపు
- స్వచ్ఛభారత్‌ నిధి విరాళాలకు వందశాతం ఆదాయం పన్ను రాయితీ
- సిగరెట్‌, పాన్‌మసాలాపై పన్ను పెంపు
- సీనియర్‌ సిటిజన్లకు రూ.30వేలు మినహాయింపు
- పింఛను నిధుల కోసం మినహాయింపు రూ.లక్ష నుంచి లక్షన్నరకు పెంపు
- ఉద్యోగులకు రవాణా అలవెన్స్‌ మినహాయింపు...రూ.800 నుంచి రూ.1600కు పెంపు
- పన్నుల మార్పుల వల్ల ప్రభుత్వానికి పెరిగిన రాబడి రూ.15వేల కోట్లు మాత్రమే 

బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు :
- మౌలిక సదుపాయల ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయింపు
- పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాత్మకంగా ఉంటుంది
- మేం సబ్సిడీలకు వ్యతిరేకం కాదు...సబ్సిడీల దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరముంది
- నగదు బదిలీ పథకాన్ని మరింత విస్తరిస్తాం
- అనేక సబ్సిడీలు ఇకపై నగదు బదిలీ ద్వారా అమలు
- చిన్న వ్యాపారుల కోసం ముద్రా బ్యాంక్‌ ఏర్పాటు
- దేశంలో 5.77కోట్ల చిన్న వ్యాపారులు...వారిలో 62శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారు
- జనధన యోజన పథకం అమలు కోసం...పోస్టల్‌ లోగోను పూర్తిగా ఉపయోగిస్తాం
- దేశంలో అత్యధికులకు ఎలాంటి బీమా సౌకర్యంలేదు
- త్వరలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం
- ఏడాదికి రూ.12 ప్రీమియంతో రూ.2లక్షల ఇన్సూరెన్స్‌
- త్వరలో ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి యోజన పథకం
- క్లెయిమ్‌ చేయని పీఎఫ్‌ నిధులతో సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమానికి ప్రత్యేక పథకం.. మార్చిలో పూర్తి వివరాలు
- దేశంలో 10.5కోట్ల సీనియర్‌ సిటిజన్లు
- మైనారిటీ యువత కోసం నయీమంజిల్‌ పథకం
- గత పదేళ్లలో మౌలికసదుపాయాల కల్పన వెనుకబడింది
- మౌలికసదుపాయాల కల్పనకు గత ఏడాదికన్నా రూ.70వేల కోట్లు అదనం
- మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం
- రైల్వే, రోడ్డు, ఇరిగేషన్‌లో పన్నులేని బాండ్లు విడుదల 

కార్పొరేట్ టాక్స్ ను కేంద్ర ప్రభుత్వం 25 శాతానికి తగ్గించింది. ఇది నాలుగేళ్లపాటు వర్తిస్తుంది. ఇంతకు ముందు కార్పొరేట్ టాక్స్ రేటు 30 శాతంగా ఉండేది. కార్పొరేట్ టాక్స్ లు అదికంగా ఉండడం, వాటికి మినహాయింపులు ఉండడం వల్ల నష్టం జరుగుతోందని అందువల్ల కార్పొరేట్ సంస్థలకు వచ్చే నాలుగేళ్లలో ఇరవై ఐదు శాతం పన్ను మాత్రమే ఉంటుందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి ప్రకటించారు. 

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ

18, ఫిబ్రవరి 2015, బుధవారం

బెయిల్‌ సొమ్ముకే దిక్కులేదు.. డిపాజిట్లెలా చెల్లిస్తారు?

న్యూఢిల్లీ: ఏడాది కాలంగా జైలు జీవితం గడుపుతున్న సుబ్రతా రాయ్‌ బెయిల్‌ కోసం తాము సూచించిన విధంగా పది వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకే నానా తంటా లు పడుతున్న సహారా, ఆయన బెయిల్‌పై బయటికి వచ్చాక డిపాజిటర్లకు చెల్లించాల్సిన సొమ్ము ఎలా చెల్లించగలదని సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. బెయిల్‌ కోసం ఆస్తుల అమ్మకానికి సంబంధించి కొనుగోలుదారులతో మాట్లాడేందుకు సుబ్రతా రాయ్‌కు తీహార్‌ జైల్లో ప్రస్తుతం కల్పిస్తున్న వసతులను మరో 4- 6 వారాలు పొడిగించాలని సహారా గ్రూప్‌ సుప్రీంకోర్టును కోరింది. ఈ సందర్భంగా బెయిల్‌ కోసం సహారా ఏ విధంగా నిధులు సమీకరిస్తుంది, అనంతరం డిపాజిటర్లకు ఎలా సొమ్ములు చెల్లిస్తుందని సుప్రీం కోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ‘మీరు కేవలం పది వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకే నానా ఇబ్బందులు పడుతున్నారు. మరి అలాంటప్పుడు జైలు నుంచి బయటకి వచ్చాక 30 వేల కోట్ల రూపాయలను ఎలా చెల్లిస్తారు’ అని జస్టిస్‌ టిఎస్‌ ఠాకూర్‌ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్‌ సహారా న్యాయవాదులను ప్రశ్నించింది. వసతుల పొడిగింపునకు సంబంధించి సరైన దరఖాస్తును సమర్పించాలని న్యాయవాదులకు బెంచ్‌ సూచించింది. ఆస్తుల విక్రయానికి సంబంధించి ఇతరత్రా మార్గాలను సూచించాలని ఈ కేసులో అమికస్‌ క్యురిగా వ్యవహరిస్తున్న శేఖర్‌ నఫాడెను బెంచ్‌ కోరింది. ఈ విక్రయాల పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బిఎన్‌ అగర్వాల్‌ సేవలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతకుముందు సుబ్రతా కోసం అమెరికాకు చెందిన మిరాక్‌ క్యాపిటల్‌ గ్రూప్‌తో పదివేల కోట్ల రూపాయల రుణ సేకరణ యత్నాలు విఫలమయ్యాయని సహారా సుప్రీంకోర్టుకు తెలిపింది. ప్రస్తుతం మరో మూడు ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని, వీటిలో డచ్‌ కంపెనీతో డీల్‌ కుదురుతుందని ఆశలు ఉన్నట్లు సహరా కోర్టుకు తెలిపింది. అంతేకాక తమ ఆంబీ వ్యాలీ ప్రాజెక్టు కోసం మంచి ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది. సహారా కోరుతున్నట్లు వసతుల పొడిగింపునకు సంబంధించి వారంలో కోర్టు అనుమతి ఇవ్వవచ్చని న్యాయవాదుల్లో ఒకరు చెప్పారు.
మమ్మల్ని కూడా చేర్చుకోండి: ఆర్‌బిఐ
ఈ కేసులో తమను కూడా పార్టీగా చేర్చుకోవాలని తాజాగా ఆర్‌బిఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయ్‌ విడుదల కోసం ఆస్తులు అమ్మకుండా సహారాకు చెందిన సహారా ఇండియా ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌ (ఎ్‌సఐఎ్‌ఫసిఎల్‌)ను నిరోధించాలని ఆర్‌బిఐ.. సుప్రీంకోర్టును కోరింది. ఈ సంస్థ ఆర్‌ఎన్‌బిసి అని, తమ నియంత్రణలో ఉంటుందని అందువల్ల సెబికి నిధులు చెల్లించేందుకు సంస్థ ఆస్తులను వినియోగించకుండా చూడాలని కోరింది. ఒకవేళ ఉమ్మడి అకౌంట్‌లో ఎస్‌ఐఎ్‌ఫసిఎల్‌ ఆస్తులను అమ్మడం ద్వారా ఏదైనా సొత్తు జమై ఉంటే, దాన్ని ఎస్ర్కో అకౌంట్‌లో డిపాజిట్‌ చేయాలని కోరింది.
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆస్తులు, సంవత్సరాల తరబడి భారత క్రికెట్‌ టీమ్‌కు స్పాన్సర్‌షిప్‌, క్రికెటర్లకు లగ్జరీ బంగ్లాలు కానుకగా ఇచ్చిన గతం. ఎన్నో స్పోర్ట్స్‌ టీమ్‌లకు అధినాయకత్వం. దేశవ్యాప్తంగా పెద్ద నెట్‌వర్క్‌... ఇన్ని ఉన్న ఒక వ్యక్తి బెయిల్‌ కోసం పది వేల కోట్ల రూపాయలు కూడబెట్టలేక ఏడాది కాలంగా జైల్లో ఉంటున్నాడంటే అసలు ఈయన ఆస్తులు నిజమైనవేనా? అని ఎవరికైనా అనుమానం వస్తుంది. సహారా అధిపతిపై సుప్రీం కోర్టుకు సైతం ఇదే అనుమానం వచ్చింది. నిజానికి సంస్థ ఆస్తుల్లో చాలా భాగం బినామీలవని, వాటిని విక్రయించేందుకు సదరు పెద్దలు ఒప్పుకోవడంలేదని అంతర్గత సమాచారం. సెబి సైతం ఇవే భయాలను వ్యక్తం చేస్తోంది. ఇదే నిజమైతే ఇలాంటి ఇంటిదొంగల గుట్టు రట్టు చేయలేకపోతున్న ప్రభుత్వం, పరిశోధక సంస్థలు విదేశాల నుంచి నల్లధనాన్ని రప్పించగలవా? ఇంకో ఏడాదికైనా సుబ్రతా రాయ్‌ బయటకి వస్తాడా? వచ్చినా డిపాజిటర్లకు సొమ్ములు వెనక్కి ఇస్తాడా?

16, ఫిబ్రవరి 2015, సోమవారం

నేటినుంచే ఏపీ రాజధాని భూసేకరణ

Updated : 12/9/2014 1:46:35 AM
Views : 277
-భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు
-వారు ఇవ్వకుంటే ప్రభుత్వమే సేకరిస్తుంది
-ఆరు నెలల పాలన బాగుంది:ఏపీ చంద్రబాబు

హైదరాబాద్, డిసెంబర్ 8 (టీ మీడియా):రాజధాని కోసం చేపట్టనున్న భూసేకరణ మంగళవారం నుంచి అధికారికంగా మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొన్ని పార్టీలు కావాలనే రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ రాజధాని నిర్మాణం, ఇతరత్రా అవసరాల కోసం భూములు ఇచ్చేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని చెప్పారు. రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాకుంటే ప్రభుత్వమే భూ సేకరణ చట్టం ద్వారా సేకరిస్తుందన్నారు.

హైదరాబాద్‌లోని ఏపీ సచివాలయంలో సోమవారం మీడియా సమావేశంలో రాజధాని భూముల సమీకరణ ప్యాకేజీ వివరాలను వెల్లడించారు. పట్టాదారు పాసు పుస్తకం కలిగి ఉన్న మెట్ట భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. జరీబు భూములకు వెయ్యి గజాల నివాస స్థలం, 300 గజాల వాణిజ్య స్థలం అందజేస్తామన్నారు.

రైతులు పెంచిన టేకు చెట్ల అమ్మకానికి అనుమతిస్తామని, నిమ్మ, సపోట, జామ తోటల రైతులకు ఎకరానికి రూ.50,000 చొప్పున ఏకమొత్తంగా చెల్లిస్తామన్నారు. వాస్తు ప్రకారమే విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని నిర్మాణానికి సిద్ధపడినట్లు చెప్పారు. రాజధాని ఇన్నర్ రింగ్‌రోడ్ 75 కిలోమీటర్ల లోపు, మిడిల్ రింగ్‌రోడ్ 125 కిలోమీటర్ల లోపు, ఔటర్ రింగ్‌రోడ్ 200 కిలోమీటర్ల లోపు ఉంటుందని చెప్పారు. ఆరు నెలల తన పాలనలో బాగానే పనిచేశామన్నారు.కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్ రూపొందించి ఇస్తుందన్నారు. సింగపూర్ వాణిజ్యమంత్రి ఈశ్వరన్‌తో సోమవారం ఆయన భేటీ అయ్యారు.రాజధాని పేరుతో కార్పొరేట్‌ భూసేకరణ
Posted on: Sun 23 Nov 00:43:28.681162 2014
* వామపక్షాల సభపై దాడిని ఖండించిన రైతు సంఘం
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
             ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పేరుతో బడా విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ వర్గాలకు ఉపయోగపడే విధంగా భూసేకరణ జరుగుతోందని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆరోపించింది. ఈ మేరకు శనివారం సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. బలరామ్‌, వంగల సుబ్బారావు ప్రకటన విడుదల చేశారు. గుంటూరు జిల్లా తూళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో లాండ్‌ పూలింగ్‌లో మొదటి దఫాగా 56 వేల ఎకరాలు సేకరించడం తగదని వామపక్ష పార్టీలు తూళ్లూరులో సభ పెడితే అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. ఈ దాడిని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. రాజధాని నిర్మాణానికి విజయవాడ, గుంటూరు పరిసరాల్లో 2,3 పంటలు పండే సారవంతమైన లక్ష ఎకరాల భూములను లాండ్‌ పూలింగ్‌ విధానం ద్వారా సేకరించాలని లక్ష్యంతో చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ముందుకు సాగుతుందని విమర్శించారు. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల భూమి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లి బీడు భూములుగా మారాయని తెలిపారు. రింగ్‌ రోడ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వ పెద్దలు విజయవాడ, గుంటూరు చుట్టూ పదుల కిలో మీటర్ల పరిధిలో కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాల కోసం డెల్టా భూములు సేకరించడం జరిగిందని అన్నారు.
కార్పొరేట్‌ సంస్థల ఒత్తిడికి తలొగ్గకుండా పంట భూములను, బీడుగా మార్చే ప్రయత్నాలను ఇప్పటికైనా ప్రభుత్వం విరమి ంచుకోవాలని సూచించారు.
                  వ్యవసా యానికి, పాడి పంటలకు, రైతు కూలీల జీవనాధారానికి దశాబాద్ధాల తరబడి నిలయంగా ఉన్న సారవంతమైన కృష్ణా డెల్టాని కనుమరుగు చేసే ప్రయత్నాలను మానుకో వాలని అన్నారు. రాజధానికి అవసరమైన కార్యాలయాలు, అసెంబ్లీ, సెక్రటరియట్‌ నిర్మాణానికి సింగపూర్‌ నమూనాలో బహుళ అంతస్థుల భవనాలు, లక్ష ఎకరాలు ఎందుకు అవసరమో చంద్రబాబు ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.కలల రాజధాని నిజం కావాలంటే...
ఉమ్మడి రాష్ట్ర విభజన, ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన తరలింపు, నూతన సొంత రాజధాని నిర్మాణం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలను మెగా నగరాలుగా తీర్చిదిద్దే క్రమంలో ఆంధ్ర ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ముఖ్యంగా గుంటూరు-విజయవాడ మధ్య కొత్త రాజధాని వస్తుందనే వూహాగానాలతోనే రియల్‌ ఎస్టేట్‌ రంగానికి వూపు వచ్చింది. ఈ ప్రాంతంలో ఎకరం రూ.10 నుంచి 20లక్షలు ఉండే భూముల ధరలు నెలల వ్యవధిలో కోట్లలో పెరిగి చుక్కల్ని తాకాయి. వ్యాపార అవకాశాలు భారీగా పెరుగుతాయనే ఉద్దేశంతో వ్యాపారవేత్తలు, రియల్టర్లు తమ నల్లధనాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు.
అయిదు లేదా పదెకరాల కంటే తక్కువ భూములు కలిగిన రైతుల్లో పెరిగిన ధరల ద్వారా ప్రయోజనం దక్కేది కొద్దిమందికేననడంలో సందేహం లేదు. ఇందుకు గతానుభవాలే నిదర్శనం. పట్టణీకరణ విషయంలో అది నిరూపితమైంది. పట్టణీకరణ క్రమంలో దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాలకు సమీపంలో గట్టి పునాదులు కలిగిన వ్యవసాయరంగం బాగా దెబ్బతింది. ఆకర్షణీయ ధరలకు కొందరు, బలవంతపు భూసేకరణ చట్టాల కింద మరికొందరు రైతులు తమ భూములు కోల్పోవాల్సి వచ్చింది. ఆ వచ్చిన ధనంతో వారు నిజంగా లాభపడ్డారా అంటే, అదీ లేదు. ఎంతోమంది రైతులు ఒకేసారి వచ్చి పడిన డబ్బులను విలాసాలకు, ప్రయోజనం లేని కార్యకలాపాలకు వృథాగా ఖర్చుపెట్టి సంసారాలను గుల్ల చేసుకున్నారు. చివరికి జీవనాధారం కోల్పోయి కుటుంబాన్ని పోషించేందుకు సరైన నైపుణ్యాలు లేక ఎంతోమంది రోడ్ల పక్కన దుర్భర జీవితాలు గడిపారు. ప్రస్తుతం నవ్యాంధ్రప్రదేశ్‌ నిర్మాణం దిశగా సాగుతున్న ప్రభుత్వం అలాంటి సంఘటనలు నియంత్రించి, పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా జరగకుండా ఉండేందుకు ఎక్కువ కమతాలు కొందరి వద్దే ఉండిపోకుండా చిన్న చిన్న కమతాల కింద వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
ముందుకెళ్లే మార్గం? 
రాజధాని నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం ప్రభుత్వం 60:40 నిష్పత్తిలో సేకరించాలని భావిస్తోంది. అంటే ప్రభుత్వ ఆధీనంలో 60 శాతం భూములుంటాయి. మిగతా 40 శాతాన్ని దామాషా పద్ధతిలో స్థలాలు అప్పగించినవారికి పంచుతారు. ఈ క్రమంలో ప్రధాన జీవనాధారం కోల్పోయిన రైతులు ఎలా నెట్టుకురాగలరో చూద్దాం.
* బాధిత రైతులకు పరిహారం అందించాలి. కర్షకులకు అప్పగించిన భూముల్లో 40శాతానికి తక్కువ కాకుండా అభివృద్ధి చెందిన ప్లాట్లను ఇవ్వాలి. అవి నిర్మించినవి లేదా పూర్తిగా అభివృద్ధి చేసినవైతే మంచిది. ఎటువంటి భూములు ఇవ్వాలనే విషయంలో ప్రభుత్వం తరఫునుంచి స్పష్టత లేదు. నివాసప్రాంత భూములా, లేక వాణిజ్య ప్రాంతంలోని భూములా, నగరంలోపలి భూములా, లేక వెలుపలవి కేటాయించాలా అన్నది తేల్చాలి.
* ప్రభావిత రైతులకు వర్తించే పరిహారం విధానం- వారికి భవిష్యత్తులో అందే ప్రయోజనాలను దూరం చేయకూడదు. ముఖ్యంగా 60శాతం అభివృద్ధి ప్రాంతంలో నిర్మించే ఐటీ పార్కులు, ఆతిథ్య, వాణిజ్య సముదాయాలు, నిరంతర ఆదాయ వనరులువంటి ప్రయోజనాలను రైతులకు దక్కేలా చేయాలి.
* ఇందులో భాగంగా చాలామంది రైతులు భూముల అభివృద్ధిపరులుగా కాకుండా, భూముల విక్రయదారులుగా మిగిలిపోయే అవకాశముంది. ఎందుకంటే వారికుండే బలహీన ఆర్థిక వనరులు, పరిమిత రుణ శక్తి వల్ల మూలధన ఆస్తులమీద లాభాలు, ఆదాయాలు కోల్పోతారు. అటువంటి పరిస్థితి ఎదురుకాకుండా చూడాలి.
* నిర్వాసిత రైతులకు ఉపాధి అవకాశాలు చూపగలగాలి. కొత్త వెంచర్లు, నిర్మాణం, రవాణా, రోడ్డు, ఆహార, కేబుల్‌ నెట్‌వర్క్‌, బ్రాడ్‌బ్యాండ్‌ వంటి రంగాల్లో యువకులకు స్వయం ఉపాధి లభించేలా ఉద్యోగ హామీ ఇవ్వాలి.
* రాజధాని, మెట్రో నగరాల అభివృద్ధిలో భూయజమానులను విస్మరించరాదు.
* భూములతో నిరంతర ఆదాయం కోల్పోయే రైతులకు ఏదో ఒక రూపంలో లబ్ధిచేకూర్చాలి.
ప్రతిపాదిత 60:40 శాతం విధానం సముచితంగానూ, ఆకర్షణీయంగానూ లేదు. ఇలాంటి వాటితో విలువైన భూములను ఇచ్చేందుకు రైతులెవరూ ముందుకు రారు. మరి ప్రత్యామ్నాయమేది? ఏదైనా మంచి ప్రతిపాదన ఉందా? ఇటు ప్రభుత్వం అటు జీవనోపాధికి మూలమైన పొలాలు కోల్పోయే రైతులు... ఇద్దరికీ మేలు చేసే మార్గాముందా? రాజధాని, నగరాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనద్వారా వచ్చే ప్రయోజనాలను వారికందిచలేమా? ఇటువంటి సమస్యలకు పరిష్కారం ఉంది. అదే... పుణె-షోలాపూర్‌ హైవేలోని అత్యాధునిక మగర్‌పట్ట టౌన్‌షిప్‌ నిర్మాణ విధానం. గతంలో హదాస్‌పూర్‌గా ఉన్న గ్రామాన్ని 400 ఎకరాలలో కొత్త నగరంగా నిర్మించడంలో అవలంభించిన విధానాన్ని ఇక్కడ అమలు పరచాలి. ఈ నగరం నిర్మాణంలో రైతు కుటుంబాలదే కీలకపాత్ర. మగర్‌పట్ట టౌన్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ లిమిటెడ్‌ పేరుతో 120కిపైగా రైతు కుటుంబాలు సొంతంగా ప్రత్యేక నగరాన్ని నిర్మించుకున్నాయి. ఈ ఆదర్శ నగరం నిర్మాణం వెనుక సతీశ్‌మగర్‌ అనే వ్యక్తి ఉన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన చురుకైన పారిశ్రామికవేత్త సతీశ్‌మగర్‌. ఎన్నో టౌన్‌షిప్‌లను విజయవంతంగా నిర్మించిన అనుభవమే కాకుండా... విక్రయ సమస్యలకు చక్కని పరిష్కారం చూపిన వ్యక్తి అతడు. ఈ ప్రాంతంలో వేగవంతమైన వృద్ధి సాధించేలా చేశారు. సకల సౌకర్యాలతో నిండిన ఆ టౌన్‌షిప్‌లో లేనిదంటూ లేదు. 20 ఐటీ టవర్లు, నాలుగు వందల అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, ఆస్పత్రులు, వినోద సౌకర్యాలు ఇలా సమస్తమూ అక్కడ ఉన్నాయి. నివాస ప్రదేశం, పనిచేసే కార్యాలయం, ఆట స్థలం, షాపింగ్‌ కేంద్రంగా దాన్ని తీర్చిదిద్దారు. ఆశ్చర్యకర విషయమేమిటంటే... ప్రారంభంలో రూ.400 కోట్లుగా ఉన్న టౌన్‌ షిప్‌ మూలధనం విలువ, అది పూర్తయ్యేసరికి రూ.5000కోట్లకు చేరింది. ఆ పెరిగిన మూలధనం విలువతో రైతు వాటాదారులు లాభపడ్డారు. ఇప్పుడు వారంతా ఆర్థిక భద్రత, మంచి ఆదాయం, మెరుగైన జీవనశైలితో బతుకుతున్నారు. సాధారణ, సంప్రదాయ వ్యవసాయ కార్యకలాపాల కంటే నేడు అధికంగా లాభపడుతున్నారు. అనూహ్య విజయంతో మగర్‌పట్ట టౌన్‌షిప్‌ పేరు చుట్టుపక్కల మారుమోగింది. దాన్ని ఆదర్శంగా తీసుకొని మరెన్నో నమూనా టౌన్‌షిప్‌లు నిర్మించారు. అలాగే 51:49 మూలధనం వాటాతో మగర్‌పట్ట టౌన్‌షిప్‌ కంపెనీ మరికొన్ని నిర్మాణాలను సైతం చేపట్టింది. నూటికి నూరుశాతం రైతు వాటా, నిర్వహణతో నడిచే మగర్‌పట్ట టౌన్‌షిప్‌ నమూనా ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని నిర్మాణానికి సరిగ్గా సరిపోతుంది. ఈ విధానంతో రైతుల నుంచి సులభంగా, వివాదాలు, వ్యతిరేకతలు లేకుండా భూములు సేకరించవచ్చు. రాజధాని, మెగాసిటీల నిర్మాణం చేపట్టవచ్చు. ప్రభుత్వం, రైతులకు మేలు జరిగేలా, ప్రత్యేక వెంచర్‌గా తీర్చిదిద్దేందుకు భాగస్వామ్యం విషయంలో చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. ఇందుకోసం రైతు యాజమాన్య పద్ధతి కాకుండా... సరైన, పారదర్శక పాలనా విధానాలతో కూడిన రైతు- ప్రభుత్వ యాజమాన్య నమూనాను అనుసరిస్తే బాగుంటుంది.
'మగర్‌పట్ట'ణం ఆదర్శం
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణానికి కావలసిన భూముల సేకరణ కోసంరాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 60:40 నమూనాకు... మగర్‌పట్ట టౌన్‌షిప్‌ విధానానికి తేడా ఏమిటి? మగర్‌పట్ట విధానం వల్ల ఇటు ప్రభుత్వానికి, అటు రైతులకు ఏ విధంగా మేలు జరుగుతుంది...
* గ్రామం నుంచి 400 ఎకరాల భూమి సేకరించారు. రైతులిచ్చిన పొలాల విస్తీర్ణం ప్రకారం దామాషా పద్ధతిలో రైతులకు వాటాల కేటాయించారు.
* ఇందులో రైతులే టౌన్‌షిప్‌ అభివృద్ధివేత్తలుగా మారారు. నూతన బిజినెస్‌ వెంచర్‌లో భూ యజమానులే నూరుశాతం వాటాదారులు.
* టౌన్‌షిప్‌ ప్రణాళిక, డిజైన్‌, భూమి అభివృద్ధి నుంచి నిర్మాణం, నిర్వహణ వరకు అంతా కంపెనీ సభ్యులే సంబంధిత రంగ నిపుణుల సహాయంతో చూసుకున్నారు. మధ్యవర్తులకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు.
* నిర్మాణం పూర్తయ్యాక రైతు వాటాదారులు భూమి విక్రయంలో 30శాతం పొందుతారు. భవనాలు పూర్తిగా తయారయ్యాక కేవలం భూముల ధరే కాకుండా దానిపై అదనపు ప్రయోజనాలు కర్షకులు పొందుతారు. కంపెనీలోని వారి వారి వాటాలను బట్టి అమ్మకపు లబ్ధిని చెల్లిస్తారు.
* ఐటీ టవర్ల వంటి ప్రధాన నిర్మాణాలు కంపెనీ నిర్వహణ పరిధిలోనే ఉంటాయి. వాటి నిర్వహణ కోసం లీజుదారుల నుంచి కార్పస్‌ నిధి వసూలు చేస్తారు. ఈ ఆధునిక వెంచర్‌తో రైతులు కేవలం అదనపు విలువ ప్రయోజనాలే కాకుండా ఆకర్షణీయ వార్షిక ఆదాయాలను డివిడెండ్ల రూపంలో పొందుతారు.
* రైతు వాటాదారులు కంపెనీలో భాగస్వాములే కాకుండా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లుగా మారే అవకాశాలు ఉన్నాయి. భూ అభివృద్ధి, రోడ్ల నిర్మాణం, సరకుల సరఫరా, రవాణా, ఆతిథ్య సేవలు, కమ్యూనికేషన్‌, చిల్లర, ఆహార రంగాల్లో వ్యాపారవేత్తలుగా పనిచేసే అవకాశం కంపెనీ కల్పిస్తుంది. ఇటువంటి విధానం రైతు కుటుంబాలకు లాభదాయక, ఆకర్షణీయ ఆదాయం పొందే వెసులుబాటు కలిగిస్తుంది.
* టౌన్‌షిప్‌లో వివిధ రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలతో రైతు కుటుంబాలకు చెందిన యువకులకు మంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఏర్పడ్డాయి. కంపెనీలో నిర్వహించే వివిధ కార్యకలాపాలకు అనుగుణంగా తమ నైపుణ్యాలు పెంచుకునే సౌలభ్యం వారికి కలిగింది.
* విశాల ప్రదేశంలో ఆసుపత్రులు, ఉద్యానవనాలు, విద్య వంటి అన్ని రకాల సౌకర్యాలతో కూడిన సొంత ఇల్లు రైతు వాటాదారులకు సొంతమైంది.
(రచయిత - డాక్టర్‌ వి.రంగారావు )

మాస్టర్ ప్లాన్‌కు రూ. 1,200 కోట్లు!

Sakshi | Updated: November 25, 2014 02:29 (IST)
కన్సల్టెన్సీ ఫీజుగా ఆంధ్రప్రదేశ్‌ను కోరిన సింగపూర్ సర్కారు
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికి సింగపూర్ ప్రభుత్వం.. కన్సల్టెన్సీ చార్జీలుగా ఏకంగా రూ. 1,200 కోట్లు చెల్లించాలని కోరినట్లు సమాచారం. కొత్త రాజధాని నిర్మాణానికి ఏర్పాటు చేయబోయే కంపెనీలో వాటా తీసుకోవాలన్న ప్రతిపాదనను తిరస్కరించిన సింగపూర్ ప్రభుత్వం.. మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కన్సల్టెన్సీగా వ్యవహరించడానికి మాత్రం సుముఖత వ్యక్తం చేసింది.

 ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి ఇవ్వాల్సిందిగా స్వయంగా సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. రాజధాని నిర్మాణానికి ప్రత్యేకంగా ఒక కంపెనీని ఏర్పాటు చేస్తామని, ఆ కంపెనీలో ఆంధ్రప్రదేశ్ వాటా 51 శాతం, సింగపూర్ ప్రభుత్వం 49 శాతం వాటాగా ఏర్పాటు చేద్దామని బాబు ఇటీవల సింగపూర్ పర్యటనలో ప్రతిపాదించారని అధికార వర్గాలు తెలిపాయి. సింగపూర్ ప్రభుత్వం మాత్రం సదరు కంపెనీలో వాటాకు ఆసక్తి చూపలేదని విశ్వసనీయ సమాచారం.దీంతో  మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు మాత్రమే సింగపూర్ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు ఆ వర్గాలు వివరించాయి.

స్పెషల్ స్టోరీస్ 

భూసేకరణం

andhraprabha -   Sun, 11 Jan 2015, IST
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతోందని చిన్నప్పుడు చదువుకున్నాం. ఇప్పుడు మనిషి భూమి మీద నిలబడలేక దాని చుట్టూ తిరుగుతున్నాడు. భూ సంస్కరణలు, భూముల కేటాయింపులు, భూముల బదిలీలు, భూ పోరాటాలు మొదలైనవన్నీ గతంలో కమ్యూనిస్టుల అజెండాలోని ముఖ్యాంశాలు. సరళీకృత ఆర్థిక విధానాలు అమలులోకి వచ్చిన తరువాత భూముల కోసం పారిశ్రామిక వేత్తలు,పెద్ద కంపెనీల యజమానులు పోటాపోటీగా ప్రయత్నాలు ప్రారంభించారు. పారిశ్రామిక కారిడార్లు, ప్రత్యేక ఆర్థిక మండళ్ళకు వందలు,వేల ఎకరాల భూములు సరిపోనందున లక్షల్లో సేకరించేందుకు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాల నుంచి అతి సునాయాసంగా భూముులు పొందగలుగుతున్నారు. పరిశ్రమలు,పెద్ద వాణిజ్య సంస్ఖల కోసం వాటి భూముల యజమానుల నుంచి నేరుగా భూములను కొనుక్కునే వారు.ఇప్పుడు వారికి ఆ శ్రమ అవసరం లేకుండా ప్రభుత్వాలే సేకరించి ఇస్తున్నాయి. సేకరణ కన్నా,సమీకరణ రైతులకు లాభం అని ఊదరగొడుుతున్నాయి. ఈ నేపధ్యంలో దాదాపు ఎనభై ఏళ్ళ క్రితం నాటి భూసేకరణ చట్టాన్ని పూర్వపు యూపీఏ ప్రభుత్వం తొమ్మిదేళ్ళపాటు తాత్సారం చేసి చివరి సంవత్సరంలో సవరించింది.అది అమలులోకి రాకముందే, దాని స్థానే ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ని తెచ్చింది. భూసేకరణను సులభతరం చేయడం కోసమే ఈ ఆర్డినెన్స్‌ని తెచ్చామని బిజెపి నాయకులు పేర్కొంటుండగా, రైతులను మరింత ముంచేయడానికే కమలనాథులు ఈ ఆర్డినెన్స్‌ తెచ్చారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపధ్యంలో దీని పూర్వాపరాలను పరిశీలిద్దాం....
భూసేకరణ విధానం పై గత డిసెంబర్‌ 31న రాష్ట్రపతి విడుదల చేసిన ఆర్డినెన్స్‌ పలు తీవ్ర విమర్శలకు గురి అవుతోంది. సామాజిక వర్గాల్లోనే కాక వ్యక్తుల్లో కూడా ఈ ఆర్డినెన్స్‌ పలు అనుమానాలను కలిగిస్తోంది. కనీస జీవనోపాధిని కూడా లేకుండా చేసి కాడెద్దులు ఎకరం నేల కలిగి జీవిస్తున్న కుటుంబాలు తట్టా బుట్టా నెత్తిన పెట్టుకొని నగరాలకు వలస వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయానికి ఈ ఆర్డినెన్స్‌ కారణమయ్యే ప్రమాదం ఉంది. 2013లో కేంద్రం తెచ్చిన భూసేకరణ చట్టానికి ఈ ఆర్డినెన్స్‌ ద్వారా పలు మార్పులు చేశారు. భూస్వామి అనుమతి అవసరం లేకుండానే పారిశ్రామిక కారిడార్లకు ప్రజాపనులకు భూమిని సేకరించే అధికారం ఇపుడు ప్రభుత్వానికి వుంది. పరిశ్రమలు అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని కలుషితం చేసి కాంక్రీట్‌ అరణ్యాలుగా మార్చేయత్నం జరుగుతోందని పర్యావరణ శాస్త్రజ్ఞులు అంటున్నారు. గ్రామీణ ప్రాథమిక వనరుల అభివృద్ధి గృహ నిర్మాణం లాంటి అవసరాల కోసం భూమిని సేకరిస్తారని ఈ ఆర్డినెన్స్‌ చెబుతోంది. ఇల్లుపీకి పందిరి వేస్తున్నట్టుగా సర్కారు ఆలోచనలు వున్నట్టు కనపడుతోంది. విస్తృత పరిధిలో చూస్తే అభివృద్ధి కోసమే భూమిని సేకరించినట్లు కనపడినా సూక్ష్మంగా పరిశీలిస్తే సగటు మానవుని హక్కును విఘాతం కలుగుతుందేమోనన్న అనుమానం కలగకపోదు. ఎందుకంటే ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఏ భూమినైనా సేకరించవచ్చు. కీలకమైన మరో మార్పు ఏమిటంటే ప్రైవేట్‌ పరిశ్రమలు ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలలు ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు లాంటి అవసరాల కోసం సైతం కేంద్రం ఇప్పుడు భూసేకరణ చేయవచ్చు. ఇదొక ప్రమాదకరమైన నిర్ణయంగా మారే ప్రమాదం వుంది. 
ఏ స్థలం ఎప్పుడు పరస్వాధీనమవుతుందో తెలియదు. ఏ పంట పొలంలో ఏ భవన నిర్మాణం జరుగుతుందో రైతు ఊహించలేడు. విషయమేమంటే ఇలా సేకరించిన భూమిని ప్రైవేట్‌ సంస్థల అవసరాల కోసం కేటాయించే అవకాశం కొత్త చట్టంలో వుంది. ఇలా కేటాయించిన భూమిని వినియోగంలోకి తెచ్చేందుకు సదరు ప్రైవేట్‌ సంస్థలకు కాలపరిమితిని కూడా లేకుండా చేశారు. స్వంత దారుడి నుంచి లాక్కొని ఇంకెవరికో ఏదో సంస్థకో కేటాయించిన భూమి సద్వినియోగం అవుతుందో లేదో తెలియదు. భూస్వామికి ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారాని కన్నా ఎక్కువ లాభాలతో ఆ భూమితో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమూ చేయవచ్చు. కొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం ప్రైవేట్‌ రంగంలో ఆసుపత్రులు విశ్వవిద్యాలయాల అవసరాల కోసం కూడా కేంద్రం భూస్వాముల అంగీకారానికి అతీతంగా భూమిని సేకరించే వీలుంది. ఉదాహరణకు రంగయ్య అనే వ్యక్తికి తన గ్రామంలో వున్న ఐదు ఎకరాల భూమిపై ఏదేని పారిశ్రామిక సంస్థకాని ప్రైవేట్‌ పాఠశాల ఏర్పాటు చేయాలన్న వ్యక్తులకు కానీ కన్ను పడిందంటే ఈ సరికొత్త ఆర్డినెన్స్‌ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రాతిపదిక లేకుండానే సేకరించి సదరు సంస్థల పరం చేయవచ్చు. అయితే గతంలో లాగా కాక భూస్వామికి అత్యధిక నష్టపరిహారం చెల్లించే వెసులుబాటును ఈ ఆర్డినెన్స్‌ ద్వారా కల్పించారు. గత భూసేకరణ చట్టంలో ప్రైవేట్‌ ఆసుపత్రులకు కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ప్రైవేట్‌ హోటల్‌ నిర్మాణాలకు భూమిని సేకరించి కేటాయించే అధికారం కేంద్రానికి వుండేది కాదు. కాగా ఈ జనవరి మొదటి తేదీ నుంచి అమలులోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టంలో ప్రైవేట్‌ భాగస్వామ్యంలోని అన్ని నిర్మాణాల అవసరాలకూ కేంద్రం భూమిని సేకరించవచ్చు. సామాజిక ప్రాథమిక వనరుల అభివృద్ధి కోసం కూడా భూమిని సేకరించే అధికారం ఈ ఆర్డినెన్స్‌ కేంద్రానికి కట్టబెడుతోంది. పరిశ్రమలకు ఇతర ప్రైవేట్‌ సంస్థల ఏర్పాటు కోసం సేకరించిన భూమిని తక్షణమే వినియోగంలోకి తేవాలన్న నియమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టంలో తొలగించింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం ఆలోచనా విధానంలో కొంత దార్శనీయకత వ్యక్తమవుతున్నా దేశంలోని భూములన్నింటిపై హక్కును తన హస్తగతం చేసుకోవడం పౌరులకు భూమిపై ఉన్న ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమే అవుతుంది.
మనిషి తన హక్కుకు భంగం కల్గుతోందంటే విపరీతమైన భావోద్వేగానికి గురి అవుతాడు. 2006లో ఒడిషాలోని కాళీనగర్‌ భూసేకరణ సంఘటన పర్యావరణం తీవ్ర పరిణామాలకు దారితీసింది. ఒడిషా పారిశ్రామిక మౌలిక అవసరాల అభివృద్ధి సంస్థ (ఐడీసిఓ). టాటా స్టీల్‌ సంస్థ కాళీనగర్‌లో స్టీలు ఉత్పత్తి కోసం ఒడిషా ప్రభుత్వాన్ని భూమి కేటాయించాలని కోరింది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ భూసేకరణ కోసం అధికారిక ప్రయత్నాలు ప్రారంభించగానే రైతులు వందలాదిగా ఏకమై భూమిని ఇవ్వడానికి నిరాకరించడమే గాక తీవ్రంగా నిరసించారు. దీనితో 2 జనవరి 2006లో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 14 మంది రైతులు ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ప్రభుత్వం దిగివచ్చి నష్టపరిహారాన్ని పెద్దయెత్తున పెంచడంతో రైతులు శాంతించారు. పశ్చిమ బెంగాల్లోని సింగూర్‌లో సైతం 2008లో ఇలాంటి తీవ్ర సంఘటనే జరిగింది. నానో కార్ల ఉత్పత్తికోసం సింగూర్‌లోని స్థలాలను అప్పటి ప్రభుత్వం సేకరించి టాటా కంపెనీకి ధారాదత్తం చేసే విషయం తీవ్ర పరిణామాలకు దారితీసింది. 997 ఎకరాల బహుళ పంటల భూమిని టాటా కంపెనీకోసం సేకరించే ప్రభుత్వ ప్రయత్నాన్ని రైతులు సహజంగానే అంగీకరించలేదు. నష్టపరిహారం పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించినా రైతులు ఒప్పుకోలేదు. సేకరించదలచిన స్థలం ఎంతో సారవంతమైనదే కాక రైతుల జీవనోపాధికి అదే ఆధారం. సేవ్‌ సింగూర్‌ ఫామ్‌ లాండ్‌ (సింగూర్‌ వ్యవసాయ భూముల రక్షణ) సంఘం కూడా ఏర్పాటైంది. ప్రభుత్వం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకొన్నా నిరసనలు ఆగలేదు. ఆరుమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక దశలో రైతులకు నక్సలైట్ల సహకారం కూడా లభించింది. పరిస్థితి చేయిదాటి పోవడంతో టాటా కంపెనీ వెనక్కి తగ్గి సింగూర్‌లో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఆపివేసి అన్నీ సర్దుకుని వెళ్లిపోయింది. ఇలాంటి పరిణామాలు భూసేకరణ సందర్భంలో జరిగే ప్రమాదాలు వున్నాయి. కొన్ని రాజ్యాంగేతర వ్యక్తుల ఒత్తిడికి తలొగ్గి ఇలాంటి వెసులుబాటు కల్పించనుందనే విమర్శలు వస్తున్నాయి. అయితే భూమిని కేటాయించిన అయిదు సంవత్సరాల తర్వాత కూడా ఆ భూమిని వినియోగించలేకపోతే సేకరించిన భూమిని తిరిగి భూస్వామికే తిరిగి ఇచ్చేందుకు 2103 చట్టంలో వీలు వుండేది. ప్రస్తుత చట్టంలో కాలపరిమితి లేదు. ఆర్డినెన్స్‌ ద్వారా తెచ్చిన ఈ చట్టాన్ని ఆరు నెలల్లో పార్లమెంటు ఉభయ సభలు అంగీకారం తెలపాల్సి వుంటుంది. గమనించాల్సిన మరో విషయమేమంటే ఈ కొత్త చట్టంలో ప్రైవేట్‌ కంపెనీ అనే పేరు స్థానంలో ప్రైవేట్‌ ఎంటిటీ (అస్థిత్వం) అని పేర్కొన్నారు. 
కొన్ని న్యాయపరమైన సమస్యలు రాకుండా ఇలాంటి పదాన్ని వాడారని తెలుస్తోంది. ప్రైవేట్‌ భాగస్వామ్య సంస్థలకు కార్పొరేట్‌ సంస్థలకు స్వచ్ఛంద సంస్థలకు ఈ చట్టం వల్ల మేలు చేయడానికి ఎంటిటీ అనే పదాన్ని ఉపయోగించారని అధికారవర్గాలు అంటున్నాయి. ఇదిలా వుంటే దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో వివిధ అవసరాల కోసం భూసేకరణ పాత చట్టంలోని కొన్ని క్లిష్టమైన సెక్షన్ల వల్ల తీవ్రమైన జాప్యం జరుగుతోందని రాష్ట్ర సిఇవోలు ఒత్తిడి తేవడమే ఈ ఆర్డినెన్స్‌కు కారణమని అంటున్నారు. ఈ చట్టం నుంచి గిరిజన ప్రాంతాలను మినహాయించారు. దేశంలోని దాదాపు అన్ని రకాల భూములపై హక్కు ఈ చట్టంవల్ల బ్యూరోక్రాట్స్‌కి దక్కిందనే చెప్పవచ్చు. గిరిజన ప్రాంతాల్లో భూసేకరణకు ప్రభుత్వానికి ఆ ప్రాంతాల్లోని గ్రామసభల అంగీకారం అవసరం. అయితే గ్రామ సభలు కూడా రాజకీయ పార్టీల కనుసన్నల్లోనే తీర్మానాలు చేస్తున్నాయనే వాదనలూ వున్నాయి. ఇందులో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. చివరికి భారతదేశంలోని దాదాపు అన్ని భూములు కేంద్ర యాజమాన్యంలోకి పరోక్షంగా వచ్చినట్లే భావించాలి. నాణానికి ఒకవైపు నుంచే పరిశీలిస్తే రంధ్రాన్వేషణ కిందికే వస్తుంది. నాణానికి మరోవైపు నుంచి పరికిస్తే భూసేకరణ చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ప్రపంచం మొత్తం భారతదేశం వైపే ఆసక్తిగా చూస్తోందని ప్రధాని నరేంద్రమోడీ, రవాణా, ఎనర్జీ, నీరు, శుభ్రత, కమ్యూనికేషన్స్‌, సామాజిక వాణిజ్య ప్రాథమిక అవసర రంగాల అభివృద్ధికి భూసేకరణ అనివార్యం అవుతోంది. దీనితోపాటు విద్య, వైద్య, హోటల్‌, టూరిజం రంగాల అభివృద్ధి సైతం ప్రాధాన్యమైన అంశాలే. అందుకే ఈ రంగాల అభివృద్ధికోసం భూసేకరణ తప్పనిసరి అయిందని అధికార పార్టీలవారు చెబుతున్నారు.
భూమిపై హక్కుకు భారత రాజ్యాంగం రక్షణ కల్పించింది. అందునా వ్యవసాయ కమతాలను రక్షించాల్సిన కనీస బాధ్యత పాలకులకు వుంది. ఇక్కడ ఆలోచించాల్సిన కీలక అంశం ఏమిటంటే భారతదేశంలో కోటి 96 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉన్నట్టు కేంద్ర గణాంక సంస్థ 2012లో ప్రకటించింది. మొత్తం దేశంలోని భూమి విస్తీర్ణంలో ఇది 46.1 శాతం, కోటి 4 లక్షలకు పైగా వ్యవసాయదారులు వ్యవసాయమే తమ జీవనోపాధఇగా జీవిస్తున్నారు. ఈ రంగాన్నే నమ్ముకొని కోటి 6 లక్షలకు పైగా వ్యవసాయ కూలీలు బ్రతుకుతున్నారు. 
వ్యవసాయోత్పత్తుల క్రయ విక్రయాల ద్వారా జీవిస్తున్న వారి సంఖ్య సైతం గణనీయంగానే వుంది. దీనికితోడు తలసరి వ్యవసాయ భూమి భారతదేశంలో 0.27 హెక్టార్లు మాత్రమే. ఈ పరిస్థితుల నేపథ్యంలో సర్కారు వారి ఆర్డినెన్స్‌ వల్ల చిన్న, సన్నకారు రైతుల్లో వణుకు పుడుతోంది. వ్యవసాయం సక్రమంగా 'సాగు' తేనే తలసరి ఆహార ధాన్యం ప్రతి నెల 4.56 కిలోలు మాత్రమేనని గణాంక వివరాలు తెలుపుతున్నాయి. పారిశ్రామికంగా ఇతర రంగాల అభివృద్ధికోసం వ్యవసాయ భూములను సైతం ప్రభుత్వం సేకరించడం ప్రారంభిస్తే ఫలితాలు దారుణంగా పరిణమించవచ్చని వ్యవసాయరంగ నిపుణులు అంటున్నారు. చివరికి ఎందరో అన్నదాతలు పట్టణాలకు వలసలు వచ్చి దినసరి కూలీలుగా మారే ప్రమాదమూ వుంది.
నాలుగు పేజీల ఆర్డినెన్స్‌లో భూ స్వంతదారు అంగీకారం అవసరం లేదన్న కీలకాంశం అందరినీ కలవరానికి గురిచేస్తోంది. బలవంతంగా భూమిని సేకరించడం వల్ల 6 కోట్ల ప్రజలు ఇప్పటికే తమ తమ ప్రాంతాలను విడచి వలసలు వెళ్లారు. ఇందులో నిరుపేదల సంఖ్యే అధికం, దళితులకు గిరిజనులకు మేలు చేయాలన్న ప్రాథమిక సూత్రం భూసేకరణ వల్ల నీరుగారి పోతోంది. గతంలో కూడా భూసేకరణ అధికారం ప్రభుత్వానిదే అయినా ప్రజాస్వామ్యంలోని స్వేచ్ఛవల్ల భూసేకరణ అంత సులువుగా కొనసాగలేదు. ప్రజాపోరాటాలకి చాలాసార్లు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
అయితే ప్రైవేట్‌ వ్యాపార సంస్థల ఒత్తిడికి కేంద్రం తలొగ్గక తప్పలేదు. ప్రైవేట్‌ రంగంలో ఎలాంటి వాణిజ్యాత్మక నిర్మాణానికైనా కేంద్ర భూమిని సేకరించి మరీ కట్టబెట్టే అవకాశాలు ఈ ఆర్డినెన్స్‌ ద్వారా పెరిగాయి. మరో విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే ప్రభుత్వం భూమిని సేకరించి నష్టపరిహారాన్ని చెల్లించిన వెంటనే సదరు భూమికి హక్కుదారు ప్రభుత్వమే అవుతుంది. ఆ తర్వాత ఎలాంటి క్లెయిములకైనా చట్టబద్ధత వుండదు. గతంలో రాచరిక వ్యవస్థలో ఇలాంటి పరిస్థితులు వుండేవి. తన పాలనలోని భూములన్నింటికీ రాజీ స్వంతదారుడుగా వుండేవాడు. ఏ క్షణాన్నైనా రాజుకు ఎవరి భూమినైనా తన స్వాధీనంలోకి తెచ్చుకునే అవకాశం వుండేది. ఈ ఆర్డినెన్స్‌ దాదాపు అలాంటి హక్కు భూక్తాలనే ప్రభుత్వానికి కల్పిస్తున్నట్లు వుంది. ఇదిలా వుంటే పారిశ్రామిక కారిడార్ల కోసం భూసేకరణ అనే పదంలో కొంత అయోమయం వ్యక్తమవుతోంది. నిజానికి పారిశ్రామిక కారిడార్‌ అనే పదానికి సరియైన నిర్వచనమే లేదు. ముంబయి -ఢిల్లీ పారిశ్రామిక ప్రాజెక్టును పరిశీలిస్తే ఈ నిజం తెలుస్తుంది.1483 కిలోమీటర్ల రైల్‌ రవాణా సుంకం (ఫ్రైట్‌) కారిడార్‌ వ్యవస్థ ఎన్నో అనర్దాలను సృష్టిస్తోంది. ఈ కారిడార్‌కు ఇరువైపులా 150 కిలోమీటర్ల పరిధిలో కొత్త నగరాలు ఐటి పార్కులు పారిశ్రామిక జోన్లు మెగా పవర్‌ ప్లాంట్లు ప్రత్యేక పెట్టుబడుల ప్రాంతాలు పోర్టులు ఫుడ్‌, ఆగ్రో పార్కులు అంతర్గత టౌన్లు కార్గో హబ్బులు, హోటళ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు... ఇలా ఒక కొత్త ప్రపంచానికే ప్రణాళికలు వేశారు. అయితే పారిశ్రామిక కారిడార్‌ అనే పదానికి నిర్వచనం లేదు కనుక కోర్టు ఈ పదాన్ని నిర్వచించే దాకా ఈ ప్రాజెక్టుకు భూమి సేకరణ అభ్యంతరకరంగా మారింది. ఇలాంటి న్యాయపరమైన అంశాలు కొన్ని కేంద్రానికి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.
ఇదిలా వుంటే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణం కోసం చేస్తున్న భూసేకరణ విధానం కేంద్రం తెచ్చిన 2014 భూసేకరణ విధానానికి భిన్నంగా వుంది. ఒక సరికొత్త విధానాన్ని చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్నారు. కృష్ణానదీ తీరానికి దగ్గర్లోని 3,600 ఎకరాల్లోని 29 గ్రామాల పరిధిలో రాజధాని నిర్మాణం కోసం భూసేకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. విచిత్రమేమంటే కేంద్రం ప్రకటించిన భూసేకరణ చట్టం ప్రకారం సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం స్వచ్ఛందంగానే స్వీకరించి సేకరించిన భూమికి నిర్ణయించిన నిష్పత్తిలో కొంతభాగాన్ని భూస్వామికి కేటాయిస్తారు. సదరు భూమిని అభివృద్ధి చేసి తిరిగి భూస్వామికి ఇస్తారు. దీనితో భూస్వామి సహజంగానే పెరిగిన ధరతో భూమిని విక్రయించుకొని లాభాలను సంపాదించే అవకాశం వుంది. ఇదేకాక భూస్వామి స్టాంపు డ్యూటీని రిజిస్ట్రేషన్‌ పన్నును చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కొందరు ఈ విధానం కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా వుందని అంటున్నారు.
చంద్రబాబు నాయుడు తన స్వంత ఆలోచనలతో చట్టాలను ఉల్లంఘిస్తూ భూస్వాములకు రక్షణ కల్పించడంలో విఫలమౌతున్నారని కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు అంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని కోసం చేస్తున్న భూమి సేకరణను భూసమీకరణ (ల్యాండ్‌ పూలింగ్‌) అని పేరుపెట్టుకున్నారు. అయితే ఇదొక ముందు చూపులేని కార్యక్రమంగా మేధావులు పలు పార్టీలకు చెందినవారు పేర్కొన్నారు. మాజీ హైకోర్టు జడ్జి పి.లక్ష్మణ్‌ రెడ్డి ఈ వ్యవహారం చట్టబద్ధమైంది కాదని అన్నారు. వ్యవసాయ భూములను ఏ పేరుతో సేకరించినా అది తీవ్రపరిణామాలకు దారితీస్తుందని కమ్యూనిస్టు పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నాయి. 
మాజీమంత్రి శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ వ్యవసాయ భూములను పట్టణ నిర్మాణానికి సేకరించడంలో ఔచిత్యం లేకపోగా రైతుల జీవనోపాధికి విఘాతం కల్పిస్తుందని అన్నారు. కొందరు రైతులు తమ జీవనోపాధితో రాజకీయాలు సాగిస్తే చరిత్ర పునరావృతమవుతుందని హెచ్చరించడం గమనార్హం. ఏది ఏమైనా కొత్త భూసేకరణ చట్టం సర్కారు ఆలోచనా విధానానికి అద్దం పడుతోంది. ప్రజల అభిప్రాయం సేకరించకుండానే వాళ్ల కనీస హక్కులను హరించే ప్రయత్నం ఎలాంటి ఫలితాల నిస్తుందో వేచిచూడాలి.
భావి అవసరాలకు అనుగుణంగా రాజధాని ఉండాలని..రాజధాని మళ్లీ మళ్లీ కట్టలేమన్నారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని వస్తే నాకేదో ప్రయోజనం ఉంటుందని కొందరు ఆరోపించారని తాము మాత్రం ప్రజలకు లాభం చేకూర్చే ప్రాంతాన్నే రాజధానిగా ఎంపిక చేశామని ఆయన స్పష్టం చేశారు. భూసమీకరణ కొత్తగా తాము చేసింది కాదని, అహ్మదాబాద్‌, చండీగఢ్‌లో కూడా ఇదే పద్ధతిని అవలంభించారని చంద్రబాబు గుర్తు చేశారు. భూ సమీక రణ కోసం మంత్రివర్గం ఉపసంఘాన్ని నియమించి.. రైతులను ఒప్పించి నిర్ణయం తీసుకున్నామని ఆయన సభకు తెలిపారు.
గత ప్రభుత్వం సెజ్‌ల పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూ ములు లాక్కుందని, రాష్ట్రాన్ని దోచుకుందని చంద్రబాబునాయుడు ఘాటుగా ఆరోపించారు. దోపిడి దొంగల గుండెల్లో నిద్రపోతామని ఆయన  హెచ్చరించారు.  భూసమీకరణ ద్వారా భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని ప్యాకేజీని రైతులకు ఇస్తున్నామని ఆయన మరో సారి విస్పష్టం చేశారు. రాజధానికి భూములు ఇచ్చే రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన వాళ్లు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రయోజనం చేకూరు స్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. తుది ఫలసాయం తీసుకున్న తర్వాతే భూసమీకరణ చేపడుతామని ఆయన ప్రకటించారు.
తెలుగుజాతి గర్వపడేలా రాజధాని నిర్మించుకోవాల్సిన అవసరం రాష్ట్రానికి ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాజధాని నిర్మానానికి కేంద్ర ఫ్రభుత్వం సహకరించాలని కోరారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నీ రాయితీలు, సదుపాయాలను రాష్ట్రానికి కల్పించాలని ఆయన కోరారు. హైదరాబాద్‌ లాంటి రాజధాని నిర్మించాలంటే రూ. 5 లక్షల కోట్లు అవసరమవతూయని గతంలోనే తాను చెప్పి నట్లు గుర్తు చేశారు. పరిపాలన భవనాలు నిర్మించినంత మాత్రాన దానిని రాజధాని అనరని చంద్రబాబునాయుడు వ్యాఖ్యనించారు.
వైఎస్సార్సీ పార్టీ సభ్యులు సభలో సిఆర్‌డిఏ బిల్లు గురించి మాట్లాడుతున్నారా? లేక రాజధాని ఎక్కడ పెట్టాలన్న దానిపై మాట్లాడుతున్నారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. వైసిపి సభ్యులు గందరగోళంలో ఉన్నారని, పూర్తిగా ఆలోచించుకుని దేనిపై మాట్లాడుతారో నిర్ణయించుకోవాలని వాయన సూచించారు. కొందరు రాజధాని దొనకొండ, ఇడుపులపాయకు తీసుకోవాలని అనుకున్నారని జగన్‌ను ఉద్దేశించి ఆయన ఈవ్యాఖ్యలు  చేశారు. ముఖ్యమంత్రిగా తనకు రాష్ట్ర రాజధా నిని మా ఊరుకు తీసుకుపోయే అవకాశం ఉందని..కానీ ప్రజలకు న్యాయం చేయాలని..రాజధాని రాష్ట్రం మధ్యలో ఉండాలని, పది మందికి ఉపయోగప డాలని.. భావితరాలు ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈనిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.  దొనకొండను ఒక ఇండస్ట్రీ యల్‌ ఏస్టేట్‌గా, స్మార్ట్‌ సిటీగా తయారు చేస్తామని ఆయన ప్రకటించారు. అదే మాదిరిగా కర్నూలును కూడా అభివృద్ది చేస్తామని ఆయన చెప్పారు.
రాజధాని నిర్మాణం కోసం లాండ్‌ పూలింగ్‌ తామేమీ కొత్తగా చేస్తున్నది కాదని ఆయన పేర్కొన్నారు. రాజధాని కోసం దేశంలో ఎక్కడా ఇవ్వనటువంటి విధంగా లాండ్‌పూలింగ్‌ ఎపికి ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధాని ఏర్పాటు కారణంగా అందరూ సంతోషంగా ఉండాలనేదే తమ అభిమతమని బాబు స్పష్టం చేశారు. లాండ్‌పూలింగ్‌ విషయంలో అందరికి న్యాయం చేస్తామన్నారు. ఎలా చేస్తే న్యాయం జరుగుతుందనేది ఆలోచిస్తున్నామన్నారు. ఉపయోగపడే అంశాలు ఎవరూ చెప్పినా వాటిని స్వీకరించి ప్రపంచంలోనే ఉత్తమమైన రాజధానిగా నిర్మిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారు.

15, ఫిబ్రవరి 2015, ఆదివారం

భూ సేకరణ చట్టానికి అడ్డగోలు సవరణలు
Posted on: Fri 13 Feb 23:15:36.737177 2015

                   భారతదేశంలో భూ సేకరణ ఏ మేరకు జరిగిందని చెప్పడానికి ప్రణాళికాబద్ధమైన అధికార రికార్డులేవీ లేవు. అలాగే భూమిని సేకరించడం వల్ల ఎంతమంది నిర్వాసితులయ్యారనే సమాచారం కూడా లేదు. ప్రస్తుతం అస్తిత్వంలో లేని ప్రణాళికా సంఘం సూచించినట్లుగా 1947-2004 మధ్య కాలంలో నిర్వాసితులైన లేదా బాధితులైన వారి సంఖ్య దాదాపు ఆరు కోట్లుగా ఉంది. 70 లక్షల హెక్టార్ల అటవీ భూమి, 60 లక్షల హెక్టార్ల ఇతర ఉమ్మడి ఆస్తులతో సహా మొత్తం 2.5 కోట్ల హెక్టార్ల భూమి సేకరణకు గురైంది. ప్రాజెక్టులు నిర్మించడం వల్ల నిర్వాసితులైన బాధితుల్లో ఆదివాసీలు 40 శాతంగా ఉన్నారు. దళితులు 20 శాతం ఉన్నారు. గత 57 ఏళ్ళ గెజిట్‌ నోటిఫికేషన్ల ఆధారంగా గుజరాత్‌పై చేసిన అధ్యయనం ప్రకారం ఇదే కాలంలో అక్కడ ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులకు 32 లక్షల హెక్టార్ల భూమిని సేకరించింది. దీనివల్ల 25 లక్షల మంది నిర్వాసితులయ్యారు. అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో 5 శాతం మంది నిర్వాసితులు కాగా 16 శాతం భూమి స్వాధీనం చేసుకోబడింది. ఇక్కడ గుజరాత్‌నే ప్రస్తావించడానికి కారణం ఇప్పుడు ఆ నమూనానే దేశం మొత్తానికీ వర్తింపజేయ చూస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, గత ఏడాది చివరిలో మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసింది. భూ సేకరణ, పునరావాసం, రీసెటిల్‌మెంట్‌ చట్టం-2013లో సక్రమమైన నష్టపరిహారం, పారదర్శకతకు గల హక్కును సవరిస్తూ ఆ ఆర్డినెన్స్‌ జారీ చేశారు. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ముందే సవరించారు. ఈ సవరణల తర్వాత రైతాంగం, కౌలు రైతులు, ఆ భూముల మీద ఆధారపడే వ్యక్తుల కోణం నుంచి యుపిఎ చట్టంలోని లొసుగులను పరిశీలిస్తే ఈ లొసుగులన్నీ ఇతర అనేక రకాల నిబంధనలతో ముడిబడి ఉన్నాయి. అయితే, పారదర్శకతను, స్వచ్ఛతను, జవాబుదారీతనాన్ని నెలకొల్పడానికి గల ఆ నిబంధనలు బలహీనపడడమో లేదా తొలగించడమో జరిగింది. దానితో పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది.
ప్రముఖ దేశీయ వలసవాద చట్టం
ఈ దశలో చరిత్ర గురించి కాస్త ప్రస్తావించడం ఉపయుక్తంగా ఉంటుంది. భారత్‌లో ప్రముఖ డొమైన్‌ చట్టం మూలాన్ని ఇంగ్లీషు కామన్‌ చట్టంలో కనుగొనవచ్చు. ఇది రాజ్యాంగబద్ధం కన్నా కూడా చట్టబద్ధమైనది. అయితే ఇక్కడ అభ్యంతరకమైన అంశం ఏమిటంటే, కేవలం ఆ చట్టాన్ని అమలు చేయడంలో కాదు, దాన్ని దేనికోసమైతే ఉపయోగిస్తున్నామో దాని గురించే. భూస్వామ్యవాదం, దోపిడీని అంతమొందించేందుకు గానూ నిరుపేద రైతాంగం, చిన్న రైతులు సాగించే ఉద్యమాల వల్ల ఎదురయ్యే ఒత్తిళ్ళ నేపథ్యంలో, స్వతంత్ర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఉపయోగించే డొమైన్‌ చట్టం ఆస్తి హక్కుకు తిరిగి నిర్వచనం ఇవ్వడానికి ఉద్దేశించబడింది. మిగులు సీలింగ్‌ భూములను తిరిగి పంపిణీ చేసేందుకు ఉద్దేశించిన భూ సంస్కరణల ద్వారా ఆస్తి హక్కును నిర్వచించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఇళ్ళు, పాఠశాలలు, ఇతర అభివృద్ధికి ఉద్దేశించిన మౌలిక సౌకర్యాలు అందజేయాలన్నది ఇక్కడ ఉద్దేశంగా ఉంది. అయితే దీన్ని వామపక్ష సంఘటన ప్రభుత్వాలు మినహా మరెవ్వరూ అమలు చేయలేదు. మెగా ప్రాజెక్టుల కోసం భూమిని సేకరిస్తూనే ఉన్నారు. ప్రైవేటు పరిశ్రమ ఈ అరాచకమైన వలసవాద చట్టాన్ని ఉపయోగిస్తూనే ఉంది. ఈ భూ సేకరణ వల్ల తీవ్రంగా నష్టపోయేవారు, బాధితుల జీవనోపాధి, వారి పునరావాసం వంటి విషయాల గురించి పట్టించుకోకుండా చాలా త్వరగా, చౌకగా, ఎలాంటి ప్రతిఘటన లేకుండా భూమిని స్వాధీనం చేసుకోవాలన్నదే ఈ చట్టం లక్ష్యంగా ఉంది. ప్రజా ప్రయోజనం అనేది ప్రభుత్వం ఏకైక, సంపూర్ణ విశేషాధికారంగా ఉండటం 1894 నాటి చట్టంలోని లొసుగుల్లో అతి ప్రధానమైనది. ఈ విశేషాధికారం ప్రజాస్వామ్య, న్యాయపరమైన పరిశీలనకు లొంగి ఉండకుండా చీకటి, నిరంకు శవాద పద్ధతుల ద్వారా ఈ విశేషాధికారాన్ని అమలు చేయాలని భావిస్తోంది. మరింత ఆకర్షణీయమైన ప్రజా ప్రయోజనాల ముసుగులో భూమిని తరుచుగా సేకరిస్తూ ఉంటారు. ఆ తర్వాత దాన్ని మరే ఇతర ప్రయోజనాల కోసమో బదిలీ చేస్తారు. భూమి విలువను తక్కువగా అంచనా వేయడం ద్వారా ధరలు బాగా తక్కువగా ఉండేలా చేస్తూ వచ్చారు. ఫలితంగా చాలా తక్కువ నష్టపరిహారం వచ్చేది. ఇక్కడ భూమిని సేకరించేవారే (ప్రభుత్వం) ధరను నిర్ణయించేవారు. కానీ ఈనాడు ఆర్డినెన్స్‌ బాటను ప్రభుత్వం పట్టడంతో ప్రభుత్వం అనేది పెట్టుబడిదారులకు కేవలం ఒక రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా మారిపోయింది. ఇక్కడ ప్రైవేటు లాభాలకు సంబంధించిన ప్రతి కార్యక్రమం కూడా ప్రజా ప్రయోజనాలకేనని సమర్థించడం జరుగుతోంది.
నయా ఉదారవాదం-మార్పు కోసం ఒత్తిడి
వ్యవసాయ రంగంలో తీవ్ర అసంతృప్తి, సంక్షోభం నెలకొన్న తరుణంలో ఈ చట్టాన్ని నిర్దాక్షిణ్యంగా అమలు చేయడం ప్రారంభించారు. విదేశీ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రైవేటు కార్పొరేట్‌ పెట్టుబడులపై ఆంక్షలు ఎత్తివేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పై నుంచి కింది స్థాయి వరకు అసాధారణమైన పోటీ ఉండేది. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ ప్రభుత్వాలు మరిన్ని రాయితీలిచ్చి ఆకర్షించేందుకు ప్రయత్నించేవి. పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే నిబంధనలు తేవాలంటూ అటు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇటు పారిశ్రామిక సంస్థలు కూడా డిమాండ్‌ చేసేవి. అదే సమయంలో వ్యవసాయ సంక్షోభం, అసమ్మతి పెరుగుతూ వచ్చింది. బలవంతంగానైనా సరే భూ సేకరణ జరిగింది. ఈ పరిస్థితి వల్ల అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరింత ప్రజాస్వామ్యయుతమైన, న్యాయ మైన చట్టం కావాలంటూ కింది స్థాయి నుంచి డిమాండ్‌ వచ్చింది. ఒక పక్క రైతులకు, భూమిపై ఆధారపడిన ఇతరులకు వాణిని వినిపించే అవకాశం ఇవ్వాలని, అలాగే పారిశ్రామిక రంగ అవసరాలను నెరవేర్చేలా చూడాలని - ఈ రెండు డిమాండ్ల మధ్య రాజీ ఉండేలా చూడాలని యుపిఎ ప్రభుత్వం భావించి దానిపై చర్చలు జరిపింది. ఈ కారణంతోటే, ఆ చట్టంలో అనేక లోపాలు, లొసుగులు, బలహీనతలు ఉన్నాయి. సక్రమమైన, న్యాయమైన నష్టపరిహారానికి గల హక్కు, భూ సేకరణలో పారదర్శకతకు, పునరావాసానికి, రీసెటిల్‌మెంట్‌కు యుపిఎ ప్రభుత్వం తెచ్చిన చట్టం స్థానంలో మరింత నయా ఉదారవాదంగా ఉండే ఇంకో వలసవాద చట్టాన్ని తెచ్చారు.
పురోగామి విజయాలు కాలరాయడం
2013 చట్టంలోని అన్ని పురోగామి విజయాలను, లాభాలను ఈ ఆర్డినెన్స్‌ తొలగించింది. 3ఎ అధ్యాయంలోని సెక్షన్‌ 5 పారిశ్రామిక కారిడార్లకు, జాతీయ భద్రతకు, గ్రామీణ మౌలిక సౌకర్యాలకు, ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులతో పాటు గృహ నిర్మాణం, సంబంధిత మౌలిక సౌకర్యాలకు మినహాయింపు ఇచ్చింది. వీటిన్నింటినీ ప్రజా ప్రయోజనాల నిర్ధారణ, సామాజిక ప్రభావం అంచనాల నుంచి మినహాయించింది. బహుళ పంటలను సాగు చేసే భూమి (2, 3 అధ్యాయాలు)కి రక్షణ కల్పించడం ద్వారా ఆహార భద్రతకు కూడా రక్షణ కల్పించే ప్రత్యేక నిబంధన నుంచి కూడా మినహాయింపు లభించింది. అన్నింటి కంటే అధ్వాన్నమైన అంశం ఏమిటంటే, ఈ ప్రాజెక్టున్నింటికీ భూ యజమానులు (70 శాతం ప్రభుత్వ, 80 శాతం ప్రైవేటు ప్రాజెక్టులు) 3(2) సవరణల కింద మినహాయించబడుతున్నారు. మినహాయింపులిస్తున్న ఈ సుదీర్ఘమైన జాబితా ఆచరణాత్మకంగా ప్రతి దానికీ బలవంత ంగానైనా భూ సేకరణను లేదా స్వాధీనాన్ని అనుమతిస్తోంది. 3(1) సవరణ ప్రభుత్వ ప్రయోజనాలు అనే నిర్వచనం పరిధిలోకి ప్రైవేటు ఆస్పత్రులను, ప్రైవేటు విద్యా సంస్థలను తెచ్చింది. ఈ రకంగా, ప్రైవేటు కంపెనీ అనే పదం స్థానంలో ప్రైవేటు సంస్థ అని పెట్టుకున్నాం. ఈ ప్రైవేటు సంస్థల పరిధిలోకి అన్ని ప్రభుత్వేతర సంస్థలు అంటే ప్రొప్రయిటర్‌, భాగస్వామ్యం, సహాయం, లాభార్జన లేని సంస్థలు ఉన్నాయి. ఎలాంటి ఉపయోగం లేకుండానే భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని నివారించేందుకు గానూ సెక్షన్‌ 101 ప్రకారం భూమిని తిరిగి భూ యజమానికి ఇచ్చేయడం లేదా ఒకవేళ భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత కూడా ఐదేళ్ళపాటు నిరుపయోగంగా పడివుంటే అప్పుడు దాన్ని భూ బ్యాంక్‌కు బదలాయించడం చేయాలని పేర్కొంటోంది. దీనికి చేసిన సవరణ 9 ఏ ప్రాజెక్టునైనా నెలకొల్పడానికి ప్రత్యేకంగా నిర్దేశించిన సమయం లేదా ఐదేళ్ళు ఏది ఎక్కువ అయితే అది అమలు చేయాలని పేర్కొంటోంది. అయితే ఆ సవరణను దేనికీ పనికి రాకుండా చేశారు. దానికి ఎవరూ కట్టుబడి ఉండడం లేదు. పైగా, ఇలా స్వాధీనం చేసుకున్న భూమి విలువ బాగా పెరిగే వరకూ వేచివుండి ఆ తర్వాత దాన్ని చాలా సులభంగా అమ్మివేయడం ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు ఆర్జిస్తున్నారు. అన్ని ప్రైవేటు కంపెనీలు, రియల్‌ ఎస్టేట్‌ తిమింగలాలు చేసే పని ఇదే. 11వ సవరణ ద్వారా సెక్షన్‌ 113ను సవరించడం ద్వారా ఈ చట్టంలోని ఏ భాగాన్నైనా క్లిష్టతలను తొలగించే పేరుతో సవరించుకోవడానికి అవసరమైన చర్యలా తీసుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం 2018 వరకు అమల్లో ఉండేలా ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే సంబంధిత విభాగ అధిపతి కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందని గత చట్టంలోని సెక్షన్‌ 87 పేర్కొంటోంది. దాన్ని మార్చి ఆ స్థానంలో సెక్షన్‌ 197ను ప్రవేశపెట్టడంతో ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యులుగా ఉండేందుకు చేసిన చిన్న ప్రయత్నం కూడా బెడిసికొట్టింది.
సెక్షన్‌ 113 వివిధ నిబంధనలను (నష్టపరిహారం, ఉపశమనం, పునరావాసం, ఇతర ఇటువంటి నిబంధనలు) అమలు చేసేందుకు రెండేళ్ళ కాలపరిమితి ఇచ్చింది. దాన్ని ఇప్పుడు ఐదేళ్ళకు పెంచారు. భూ సేకరణ లేదా స్వాధీన చట్టం -1894 కింద చేపట్టి, ఆమోదించిన కేసులు ఉంటాయి. కానీ ఇందులో భూమిని స్వాధీనం చేసుకోవడం కానీ లేదా నష్టపరిహారం చెల్లించకపోవడం కానీ జరగలేదు. కానీ, సెక్షన్‌ 24 నిబంధన మాత్రం ఒక విషయాన్ని స్పష్టంగా ప్రకటించింది. ఈ చట్టం ఆమోదించిన ఐదేళ్ళ తర్వాత లేదా ఇవన్నీ మురిగిపోతాయని ప్రకటించింది. తిరిగి తాజాగా చర్చలు చేపట్టాల్సిన అవసరముందని పేర్కొంది. మొత్తమ్మీద అనుసరిం చాల్సిన పద్ధతులు అన్నీ చాలా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ అనేక అవసరమైన, ప్రస్తుతం సాగుతున్న భూ సేకరణ లేదా స్వాధీన ప్రక్రియ పాత చట్టం ప్రకారం సాగిపోతున్నాయని చెబుతున్నారు.
వృద్ధి వ్యూహంగా భూ దురాక్రమణ
భూ సేకరణ చట్ట సవరణను ప్రజలకున్న వనరులపై జరిగిన మరింత దారుణమైన దాడిగా చూడవచ్చు. ఇంతవరకు నేరుగా ఈ భూమిపై హక్కు కలిగినవారికి ఆ అవకాశం లేకుండా చేసేందుకు ప్రజా వనరులపై దాడి చేశారు. పైగా అన్ని పురోగామి పరిరక్షణ చట్టాలను సవరించడానికి ఈ చర్య చేపట్టారు. ఈ చట్టాలు ప్రజలు ఎంతగానో శ్రమిస్తే వచ్చినవే. ఇక్కడ అమలు చేసిన అభివృద్ధి నమూనా ఏమిటంటే ప్రైవేటు రంగానికి ద్రవ్య, సహజ వనరుల బదిలీ, అదే ఇక్కడ బదిలీ వ్యూహం. యుపిఎ ప్రభుత్వం 2013లో ప్రాజెక్ట్‌ పర్యవేక్షణా గ్రూపును ఏర్పాటు చేసింది. 437 ప్రాజెక్టులకు గానూ 153 ప్రాజెక్టులను ఆమోదించింది. ఒక్కో ప్రాజెక్టు విలువ వెయ్యి కోట్ల పై మాటే. అంటే మొత్తంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల విలువ రూ.15 లక్షల కోట్లకు గానూ ఆమోదించిన ప్రాజెక్టుల విలువ రూ.5.3 లక్షల కోట్ల పైమాటే. ఎన్‌డిఎ ప్రభుత్వ వచ్చాక ప్రాజెక్టులపై ఆ నిషేధాన్ని రూ.500 కోట్లకు తగ్గించింది. పైగా డీమ్డ్‌ క్లియరెన్స్‌లను ప్రవేశపెట్టింది. నిర్దిష్ట కాల పరిమితిలో ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తకపోతే అవి ఆమోదించబడినట్లే అని అర్థమవుతోంది. ఇటువంటి పరిస్థితులు నెలకొన్న తరుణంలో సమాజంలోని అన్ని ప్రగతిశీల వర్గాలు, శక్తులు కలిసి ఈ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా పోరాడాల్సిన అవసరం  ఎంతైనా ఉంది.
- స్మితా గుప్తా
లాండ్ ‘పూ’లింగ్‌
Posted on: Wed 15 Oct 00:59:58.130838 2014

                  దాంట్లో రోడ్లు, పార్కులు, బడి, ఆసుపత్రి, ప్రార్థనా ప్రదేశం ... ఇలా నిబంధనలన్నీ పాటిస్తే 35 శాతం పైగానూ, మినహాయింపులు పొందితే 30 శాతం వరకూ భూమి పోతుంది. అంటే అభివృద్ధి చేసిన భూమి గరిష్టంగా 70 ఎకరాలు ఉంటుంది. కనుక ఎకరం భూమినిచ్చిన రైతుకు 60 శాతం అయినాకూడా గరిష్టంగా దక్కేది 42 సెంట్లే ... కాదు 40 శాతం అంటే వచ్చేది 28 సెంట్లు మాత్రమే ! చిన్న పిల్లలు పాడే పిచ్చుక కథలోలా 'ఎకరం పోయి ... 28 సెంట్లొచ్చె ఢాం ఢాం ఢాం ...' అన్నమాట.
              రాజధాని నిర్మాణానికి ల్యాండ్‌ పూలింగ్‌ (భూ సమీకరణ) పద్ధతిలో భూములివ్వాలనీ అలా కాకపోతే భూ సేకరణ చట్టం ప్రకారం తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల హెచ్చరించడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల రైతాంగంలో వివిధ రూపాల్లో చర్చ సాగుతోంది. ఆ మాటకొస్తే మిగిలిన ప్రాంతాల రైతులకూ తమ భూముల్ని ప్రభుత్వం ఏ పేరుతోనైనా గుంజుకుంటుందేమోనన్న అనుమానం కలుగుతోంది. ఇంటి స్థలం లేదా అపార్ట్‌మెంట్‌ కొనుక్కోవాలనుకునేవారూ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ల్యాండ్‌ పూలింగ్‌ కథా కమామిషు చూద్దాం.
లక్ష ఎకరాలు అవసరమా ?
              రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి కావాలని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చెబుతున్న మాట మహా అతిశయోక్తి. ఆ మాట కూడా చాలదని చెప్పాలి. మహా నగరాలుగా చెప్పబడే ముంబయి, కొల్‌కతా, చెన్నరు, న్యూఢిల్లీ, ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ విస్తీర్ణం పరిశీలించినా మనకు విస్తుగొలుపుతుంది. అతి పెద్ద నగరం గ్రేటర్‌ ముంబయి విస్తీర్ణం 1,49,005 ఎకరాలు (603 చకిమీ). కొల్‌కతా మెట్రోపోలిటన్‌ ఏరియా విస్తీర్ణం ఎక్కువే అయినా కార్పొరేషన్‌ విస్తీర్ణం కేవలం 45,714 ఎకరాలేనంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా ! దేశ రాజధాని ఢిల్లీ (నేషనల్‌ క్యాపిటల్‌ టెరిటరీ) విస్తీర్ణం 3,66,457 ఎకరాలు (1,483 చకిమీ) కాగా గ్రేటర్‌ హైదరాబాద్‌ విస్తీర్ణం కూడా 1,60,615 ఎకరాలు(650 చకిమీ). ఇంతకూ ఇప్పుడున్న విజయవాడ కార్పొరేషన్‌ విస్తీర్ణం 15,290, గుంటూరు కార్పొరేషన్‌ విస్తీర్ణం 11,295 ఎకరాలు మాత్రమే ! పైన పేర్కొన్న విస్తీర్ణంలో ప్రభుత్వ, ప్రైవేటు భూములు, భవనాలున్నవీ, ఖాళీ స్థలాలు, రోడ్లు, పార్కులూ, చెరువులూ అన్నీ కలిసే ఉన్నాయి. కాబట్టి రాజధాని కోసం ప్రభుత్వమే లక్ష ఎకరాలు సేకరించాలని చెప్పడం వెనుక ఏదో మర్మం ఉందన్నమాట. చాలా భూమి అవసరం కనుక మనం కూడా ఎంతో కొంత ఇవ్వాలని రైతులు భావించేట్లు చేయడమా, లేక రాజధానికి ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది అనుకునేలా చేయడమా ? ఇంతఎక్కువ భూమి కావాలి గనుక ఇష్టంగాఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ చేస్తామని భయపెట్టడానికైనా కావచ్చు. అంతకంటె ముఖ్యంగా రైతుల భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడమే పరమ లక్ష్యంగా సర్కారు వ్యవహరిస్తోందనుకోవాలి. ఇందుకోసమే ల్యాండ్‌ పూలింగ్‌ విధానాన్ని ముందుకు తెచ్చిందనిపిస్తోంది.
పూలింగ్‌ అంటే ...
                 ఇంగ్లీష్‌లో పూల్‌(పిఒఒఎల్‌) అంటే నీటి మడుగు (గుంట) అని అర్థం. స్విమ్మింగ్‌ పూల్‌ అన్నది బాగా వాడుకలో ఉన్నదే గదా ! దాని నుంచి వచ్చిందే పూలింగ్‌. 'వనరులను ఒకచోట చేర్చి గరిష్ట ప్రయోజనం పొందేలాగున, నష్టం తగ్గించుకునే విధంగా చేపట్టే వనరుల నిర్వహణా పద్ధతి' (రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ టెర్మ్‌)గా విజ్ఞాన సర్వస్వం (వికీపీడియా) లో అభివర్ణించారు. సర్కారు చెబుతున్న మాటలు వింటే రెండు రీతులు అనిపిస్తు న్నాయి. అసమంజసమైన పంపిణీ జరిగిన సందర్భాల్లో చెప్పే 'నువ్వు పప్పు తీసుకురా నేను పొట్టు తీసుకొస్తా. ఊదేసి ఇద్దరం చెరి సగం పంచుకుందాం' అన్న సామెత ఇప్పుడు సరిగ్గా అతికేలా ఉంది. అలాగే ఏ ఆటలో అయినా ఎక్కువ మంది ఆడితే కొందరు గెలుస్తారు, ఇంకొందరు ఓడుతారు. కానీ పేేకాటలో పూల్‌ గేమ్‌ అనేదాంట్లో ఎందరాడినా ఆటలు ముగిశాక గెలిచేది మాత్రం ఒక్కరే. అందరి డబ్బూ ఒక చోటికి చేర్చి (పూల్‌ చేసి) చివర్లో గెలిచినవారికి అంతా దక్కుతుంది. ఈ రెండు ఉదాహరణల్లో ఏది నిజమైనా మోసపోయేది రైతు, లబ్ధి పొందేది కార్పొరేట్లే. ఇది వినడానికి కష్టమైనా ఈ విధానం అమలు చేస్తే చివరికి జరిగేదదే !
                   ల్యాండ్‌ పూలింగ్‌ విధానంపై ప్రభుత్వం అధికారపూర్వకంగా ఇంతవరకు ఏదీ ప్రకటించలేదు. తమకు నచ్చిన కొన్ని పత్రికల్లో ' లీకు'ల ద్వారా ప్రజల్లోకి వదిలి స్పందనను బట్టి వ్యవహరించే ఎత్తుగడతో ఉన్నట్టుంది. ఈ విధానంలో భూమినిచ్చిన రైతుకు అభివృద్ధి చేశాక దాంట్లో వెనక్కిచ్చేది 60 శాతంఅని ఒకసారి, కాదు 40 శాతం అని ఇంకోసారి ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇందులో కేవలం శాతం మతలబులేగాక కొన్ని జిమ్మిక్కులున్నాయి. మొదటి విషయం, ఒక రైతు ఎకరం భూమి ఇస్తే అతనికి/ఆమెకు తిరిగి 60 సెంట్లు (60 శాతం) లేదా 40 సెంట్లు ( 40 శాతం) భూమి తిరిగి రాదు. ఎందుకంటే తీసుకునేటప్పుడు మొత్తం భూమి విస్తీర్ణం లెక్కగట్టి రైతుకు తిరిగి ఇచ్చేటప్పుడు అభివృద్ధి చేసిన భూమిని మాత్రమే లెక్కిస్తారు గనుక స్వల్ప విస్తీర్ణమే దక్కుతుంది. తేలికగా అర్థం కావడానికి ఒక ఉదాహరణగా ఒక గ్రామంలోని వంద మంది రైతుల నుంచి ఒక్కో ఎకరం చొప్పున వంద ఎకరాలను ల్యాండ్‌ పూలింగ్‌ చేశారనుకుందాం. దాంట్లో రోడ్లు, పార్కులు, బడి, ఆసుపత్రి, ప్రార్థనా ప్రదేశం ... ఇలా నిబంధనలన్నీ పాటిస్తే 35 శాతం పైగానూ, మినహాయింపులు పొందితే 30 శాతం వరకూ భూమి పోతుంది. అంటే అభివృద్ధి చేసిన భూమి గరిష్టంగా 70 ఎకరాలు ఉంటుంది. కనుక ఎకరం భూమినిచ్చిన రైతుకు 60 శాతం అయినాకూడా గరిష్టంగా దక్కేది 42 సెంట్లే ... కాదు 40 శాతం అంటే వచ్చేది 28 సెంట్లు మాత్రమే ! చిన్న పిల్లలు పాడే పిచ్చుక కథలోలా 'ఎకరం పోయి ... 28 సెంట్లొచ్చె ఢాం ఢాం ఢాం ...' అన్నమాట.
                ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చోట్ల ల్యాండ్‌ పూలింగ్‌ పద్ధతిని అమలు చేసేందుకు యత్నించి ఒడుదుడుకులు పడుతున్న స్థితి నెలకొంది. విశాఖపట్నం పరదేశిపాలెంలో ఒక ఎకరం భూమినిచ్చిన రైతుకు 1,800 చదరపు గజాల అభివృద్ధి చేసిన స్థలాన్నిచ్చారు. ఎకరానికి 4840 గజాలు అంటే రైతుకు దక్కింది 37 శాతమే ! విజయవాడలోని జక్కంపూడిలోనూ అలాగే ఇస్తామని చెప్పారుగానీ అది ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అంతా సజావుగా జరిగితే వీటిని గరిష్ట ప్రయోజనం పొందినవాటిగా భావించవచ్చు. అక్కడ రైతులతో అగ్రిమెంటు చేసుకున్నది వుడా, కార్పొరేషన్‌ వంటి ప్రభుత్వ సంస్థలు తప్ప కార్పొరేట్‌ బిల్డర్లు కాదన్న విషయం గమనార్హం.
సొమ్మొకరిది సోకొకరికి ... 
              ల్యాండ్‌ పూలింగ్‌లో మరో కోణం రైతు భూమితో సర్కారు ... కాదు కాదు కార్పొరేట్లు సోకు చేయడం. అదెలాగో చూద్దాం. రైతు నుంచి సర్కారు ఎకరం భూమి తీసుకుని బిల్డర్‌కిస్తే దాన్ని అభివృద్ధి చేసి రైతుకు 60/40 శాతం భూమిని తిరిగిచ్చి మిగిలిన దాంట్లో భవనం నిర్మించి ప్రభుత్వం, బిల్డర్‌ చెరిసగం పంచుకుంటారట. ప్రభుత్వం ఆఫీసులు నడిపితే బిల్డర్‌ అమ్ముకొని లాభం సంపాదిస్తాడట ! అంటే రైతు భూమినే పెట్టుబడిగా పెట్టి ప్రభుత్వం ఖర్చు లేకుండా భవనాలు పొందడానికీ కార్పొరేట్‌ బిల్డర్‌ లాభాలు గడించడానికి నిస్సిగ్గుగా యత్నిస్తున్నారని ఎవరికైనా బోధపడుతుంది. కానీ అది కనిపించకుండా ఉండడానికే భూమి అదే రూపంలో ఉంటే విలువ పెరగదనీ, అభివృద్ధి చేస్తే అనేక రెట్లు పెరుగుతుందని ఒకరంటే; రైతు, బిల్డర్‌ మధ్యనే ఒప్పందం కుదిరితే సాధారణంగా రైతు మోసపోతాడనీ, ప్రభుత్వం మధ్యలో ఉంటుందిగనుక న్యాయం జరుగుతుందని మరొకరు చెబుతున్నారు. వంద రెండొందలు ఎకరాల లేఔట్‌ అయితే అంతగా మౌలిక వసతులు రావనీ, విస్తార భూఖండాల్లో అదీ ప్రభుత్వం భాగస్వామి అయితే మేలు కలుగుతుందని ల్యాండ్‌ పూలింగ్‌ సమర్థకులు అంటున్నారు. ఛత్తీస్‌గఢ్‌ నమూనా, ఛండీఘడ్‌ నమూనా అంటూ పుంఖానుపుంఖాలు రాస్తున్నారు. కానీ ఇదంతా మసి పూసి మారేడు కాయ చేయడానికీ, కార్పొరేట్లకు మేలు చేకూర్చడానికే !
వినియోగదారుకు చావుదెబ్బ
                  రియల్‌ ఎస్టేట్‌ మాయాజాలంతో ఉన్నత మధ్యతరగతివారు సైతం ఇంటి స్థలం కొనలేక అపార్ట్‌మెంటు కొంటున్నారు. రానున్న రోజుల్లో నిలకడైన ఆదాయం గల బ్యాంకు ఉద్యోగిలాంటివారు కూడా అపార్ట్‌మెంట్‌ కొనలేని దుస్థితి నెలకొననుంది. పైన పేర్కొన్న ఉదాహరణనే తీసుకుందాం. ఎకరం పది లక్షల రూపాయల చొప్పున వంద ఎకరాలు కొని లేఔట్‌ వేశారనుకుందాం. రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.70 లక్షలు ఖర్చయిందనీ, వడ్డీలు, ఇతర ఖర్చు రూ.30 లక్షలనుకుందాం. మినహాయింపులు పొందితే 70 ఎకరాలు నిర్మాణానికి వినియోగించవచ్చు. అంటే నిర్మాణానికి పనికొచ్చే ఒక ఎకరం విలువ రూ.15,71,428. గజం ధర రూ.324 అవుతుంది. ఇదే పూలింగ్‌ విధానంలో అయితే నిర్మాణానికి వినియోగించే ప్రాంతంలో సగమే బిల్డర్‌ది కనుక 35 ఎకరాలు లభిస్తుంది. ఎకరం విలువ రూ.31,42,856, గజం విలువ రూ.649 అవుతుందన్నమాట. దాన్నిబట్టి అపార్ట్‌మెంట్‌ విలువ కూడా పెరుగుతుంది. ఇదంతా మామూలుగా వేసిన లెక్క. కానీ నిజ జీవితంలో బిల్డర్ల లాభాలు, ఇతర దోపిడీ పద్ధతులూ అనేకం ఉంటాయి. ల్యాండ్‌ పూలింగ్‌లో వచ్చిందా, కాదా అన్నదాన్నిబట్టి కాకుండా అన్ని భూముల ధరలూ ఆ మేరకు పెరిగిపోతాయి. 2005 ప్రాంతంలో కేవలం హైదరాబాద్‌ చుట్టుపక్కలేగాక అన్ని చోట్లా భూముల ధరలు పెరిగాయి. ఇప్పుడూ అలానే కావచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పటికే పెరిగినవి ఇంకా రెట్టింపు, ఆ పైన అవుతాయన్నమాట. కనుక ల్యాండ్‌ పూలింగ్‌ వల్ల వినియోగదారుకు ఎలాంటి ప్రయోజనం లేదు సరికదా తీవ్ర నష్టం. ఒక విధంగా చెప్పాలంటే పట్టణాలు, నగరాల్లో ఇల్లు లేదా ఇంటి స్థలం లేనివారంతా ఈ విధమైన ల్యాండ్‌ పూలింగ్‌ను వ్యతిరేకించాలి.
             ల్యాండ్‌ పూలింగ్‌ గురించి లీకులివ్వడం కాకుండా ప్రభుత్వం స్పష్టమైన విధాన ప్రకటన చేయాలి. అప్పుడే అందరూ అర్థం చేసుకోవడం, తగిన రీతిలో స్పందించడం సాధ్యమవుతుంది. పారదర్శకత గురించి అదే పనిగా చెప్పుకునే సర్కారు విధానాన్ని అధికారికంగా వెల్లడించకపోవడం శోచనీయం. ఏది ఏమైనా అటు రైతును, ఇటు వినియోగదారునూ దెబ్బతీసి కార్పొరేట్లకు లబ్ధి చేకూర్చే ఇలాంటి ల్యాండ్‌ పూలింగ్‌ లోగుట్టును అందరూ అర్థం చేసుకోవడం అవసరం. అలా కాకపోతే పూలింగ్‌ అంటూ సర్కారు ఫూలింగ్‌ చేస్తుంది. తస్మాత్‌ జాగ్రత్త ! ప్రభుత్వం చెబుతున్న ఈ భూ సమీకరణ విధానానికీ, భూ సేకరణ చట్టంలో ఉన్న అంశాలకూ సారూప్య, విభేదాలపై తరువాత చర్చిద్దాం.

- బి తులసీదాస్‌