28, ఫిబ్రవరి 2015, శనివారం

జిడిపి వృద్ధి రేటు ఉరకలపై సర్వే అంచనాలను ఆమోదించే ముందు దృష్టిలో ఉంచుకోవాల్సిన కీలక విషయం ఒకటుంది. జిడిపిని గణించే ప్రాతిపదిక సంవత్సరాన్ని 2004-05 నుంచి 2011-12కు కొద్ది కాలం కిత్రమే మార్చారు. ఈ మార్పుతో జిడిపి లెక్కకు రెక్కలొచ్చాయి. ఆర్థిక రంగానికి అత్యంత గడ్డుకాలంగా చెప్పుకునే 2013-14లో కొత్త లెక్కప్రకారం వృద్ధి రేటు ఏకంగా 6.9 శాతానికి దూసుకుపోయింది. ఇప్పుడు అదే లెక్కల ప్రకారం వచ్చే ఏడాది 8 శాతానికి ఆపై సంవత్సరాల్లో రెండంకెల స్థాయికి దూసుకుపోతుందని సర్వే అంచనావేస్తోంది. అంకెల ఇంద్రజాలంతో సమకూరే వృద్ధి రేటు ఏమార్చడానికి తప్ప ఆర్థిక రంగ నిజపరిస్థితులను మార్చడానికి దోహదం చేయదు.

ఫారెక్స్‌ నిల్వలను లక్ష కోట్ల డాలర్లకు పెంచుకోవడం మంచిదే. అయితే అందులో స్థిరంగా ఉండే సొమ్ము ఎంతనేదే కీలకం. చిన్నపాటి ప్రతికూల పరిణామాలకే ఎగిరిపోయే సొమ్ము ఎంత ఉన్నా ప్రమాదహేతువే.

రూ. 17,77,477 కోట్లతో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రణాళికేతర వ్యయం రూ.13 లక్షల కోట్లు కాగా, ప్రణాళికా వ్యయం రూ.4.65 లక్షల కోట్లు.
బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు :
- ద్రవ్యలోటు 3.96 శాతం
- వచ్చే ఏడాది నుంచి జీఎస్‌టీ అమలు
- కార్పొరేట్‌ ట్యాక్స్‌ 30 నుంచి 25శాతానికి తగ్గింపు
- స్విస్‌ బ్యాంకుల్లో భారతీయుల ఖాతాల వివరాలు ఇచ్చేందుకు స్విట్జర్లాండ్‌ అంగీకరించింది
- నల్లధనం తగ్గించే యోచనలో భాగంగా పన్నుల విధానం
- విదేశాల్లో నల్లధనం దాచుకునే వారికి పదేళ్ల జైలుశిక్ష
- నల్లధనంపై 300శాతం జరిమానా
- నల్లధనాన్ని ప్రోత్సహించే బ్యాంకులు, సంస్థలపై జరిమానా
- బినామీ ఆస్తుల నిరోధానికి కొత్త బిల్లు
- రూ.లక్షకు మించి ఆస్తుల కొనుగోలుకు పాన్‌ నంబర్‌ తప్పనిసరి

వృద్ధి, పెట్టుబడులు పెంచడం, సంపద అందరికీ పంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతానికి చేరుకుంటుందని అంచనా మంత్రి వేశారు. ద్రవ్యోల్బణం 5.1 శాతానికి తగ్గిందని ఆయన చెప్పారు. విదేశీ మాదకద్రవ్యం నిల్వలు బాగా పెరిగాయన్న జైట్లీ విదేశీ మారకం నిల్వలు 340 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయన్నారు.

ఐటీ పరిమితుల్లో ఎలాంటి మార్పు లేదు
- సంపద పన్ను రద్దు
- రూ.కోటి ఆదాయం దాటినవారిపై 2శాతం సర్‌చార్జ్
- రూ. వెయ్యి దాటిన పాదరక్షలపై ఎక్సైజ్‌ డ్యూటీ 6శాతం తగ్గింపు
- స్వచ్ఛభారత్‌ నిధి విరాళాలకు వందశాతం ఆదాయం పన్ను రాయితీ
- సిగరెట్‌, పాన్‌మసాలాపై పన్ను పెంపు
- సీనియర్‌ సిటిజన్లకు రూ.30వేలు మినహాయింపు
- పింఛను నిధుల కోసం మినహాయింపు రూ.లక్ష నుంచి లక్షన్నరకు పెంపు
- ఉద్యోగులకు రవాణా అలవెన్స్‌ మినహాయింపు...రూ.800 నుంచి రూ.1600కు పెంపు
- పన్నుల మార్పుల వల్ల ప్రభుత్వానికి పెరిగిన రాబడి రూ.15వేల కోట్లు మాత్రమే 

బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు :
- మౌలిక సదుపాయల ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయింపు
- పెట్టుబడుల ఉపసంహరణ వ్యూహాత్మకంగా ఉంటుంది
- మేం సబ్సిడీలకు వ్యతిరేకం కాదు...సబ్సిడీల దుర్వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరముంది
- నగదు బదిలీ పథకాన్ని మరింత విస్తరిస్తాం
- అనేక సబ్సిడీలు ఇకపై నగదు బదిలీ ద్వారా అమలు
- చిన్న వ్యాపారుల కోసం ముద్రా బ్యాంక్‌ ఏర్పాటు
- దేశంలో 5.77కోట్ల చిన్న వ్యాపారులు...వారిలో 62శాతం మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారు
- జనధన యోజన పథకం అమలు కోసం...పోస్టల్‌ లోగోను పూర్తిగా ఉపయోగిస్తాం
- దేశంలో అత్యధికులకు ఎలాంటి బీమా సౌకర్యంలేదు
- త్వరలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం
- ఏడాదికి రూ.12 ప్రీమియంతో రూ.2లక్షల ఇన్సూరెన్స్‌
- త్వరలో ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి యోజన పథకం
- క్లెయిమ్‌ చేయని పీఎఫ్‌ నిధులతో సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమానికి ప్రత్యేక పథకం.. మార్చిలో పూర్తి వివరాలు
- దేశంలో 10.5కోట్ల సీనియర్‌ సిటిజన్లు
- మైనారిటీ యువత కోసం నయీమంజిల్‌ పథకం
- గత పదేళ్లలో మౌలికసదుపాయాల కల్పన వెనుకబడింది
- మౌలికసదుపాయాల కల్పనకు గత ఏడాదికన్నా రూ.70వేల కోట్లు అదనం
- మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం
- రైల్వే, రోడ్డు, ఇరిగేషన్‌లో పన్నులేని బాండ్లు విడుదల 

కార్పొరేట్ టాక్స్ ను కేంద్ర ప్రభుత్వం 25 శాతానికి తగ్గించింది. ఇది నాలుగేళ్లపాటు వర్తిస్తుంది. ఇంతకు ముందు కార్పొరేట్ టాక్స్ రేటు 30 శాతంగా ఉండేది. కార్పొరేట్ టాక్స్ లు అదికంగా ఉండడం, వాటికి మినహాయింపులు ఉండడం వల్ల నష్టం జరుగుతోందని అందువల్ల కార్పొరేట్ సంస్థలకు వచ్చే నాలుగేళ్లలో ఇరవై ఐదు శాతం పన్ను మాత్రమే ఉంటుందని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి ప్రకటించారు. 

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరణ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి